Off The Record: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడా..? అసలు ఇండియాలో ఉన్నారా?
- టీడీపీ హిట్ లిస్ట్ టాప్లో వల్లభనేని వంశీ..?
- 2014.. 2019లో వరుసగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపు..
- రెండోసారి గెలిచాక వైసీపీలోకి జంప్..
- నైతిక విలువలు లేకుండా నోటికొచ్చిన వ్యాఖ్యలు..
- గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఎ71..
- కేసులో పట్టుబడుతున్న వంశీ అనుచరులు..
- వంశీ అమెరికా వెళ్ళిపోయారన్న ప్రచారం..
- త్వరలో గన్నవరం వస్తానని అనుచరులకు సందేశం?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: టీడీపీ టార్గెట్ లిస్ట్ టాప్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉంటుందన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న విస్తృత ప్రచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విచక్షణ మరిచి వంశీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతారు. వాస్తవానికి వంశీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువకాలం రాజకీయం చేశారు. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టికెట్ మీదే వరుసగా రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. రెండోసారి గెలిచాక టిడిపిని వదిలి అప్పుడు పవర్లో ఉన్న వైసీపీకి జై కొట్టారాయన. పార్టీ మారినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. ఓ దశలో శృతిమించి… నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడటం వల్లే వంశీ పేరు హిట్ లిస్ట్లో చేరిందని చెబుతుంటాయి టీడీపీ వర్గాలు.
Read Also: Breastfeeding: 30 శాతం మంది తల్లులు పిల్లలకు పాలివ్వడం లేదు.. ప్రమాదం వారికే.. !
Also Read
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ, కొడాలి నాని టార్గెట్గా పార్టీ కేడర్ దూకుడుగా వ్యవరించింది. వంశీ ఇంటి మీదికి టిడిపి కార్యకర్తలు వెళ్ళటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొడాలి నానిపై ఇప్పటికే రెండు కేసులు నమోదవగా గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి ఘటనలో ఏ 71గా ఉన్నారు వంశీ.ఈ కేసులో కొంత మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వంశీ కోసం రెండు నెలలుగా గాలిస్తున్నారు. ఆయన అనుచరులు వరసగా పట్టుబడుతున్నప్పటికీ వంశీ మాత్రం ఇంకా చిక్కలేదు. దీంతో అసలాయన ఎక్కడ ఉన్నారన్న చర్చ మొదలైంది. దేశంలోనే ఉన్నారా లేక అమెరికాకు వెళ్ళిపోయారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. అయితే దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ఈ విషయంలో ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి వాదన వారిది. అంతే తప్ప వాస్తవం ఎవరికీ తెలియదు. అలాగని పోలీసుల వైపు నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. మరోవైపు తన ముఖ్య అనుచరులకు టచ్లో ఉన్నారని, త్వరలోనే గన్నవరం వస్తానని చెబుతున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అంతా ఫోన్ కాంటాక్ట్ తప్ప… మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారన్నది వాళ్ళకు కూడా తెలియదని అంటున్నారు.
ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారంటూ కొద్దిసేపు హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చుకోవావాల్సి వచ్చింది. అయితే ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. అదే సమయంలో వంశీ, కొడాలి నాని ఇద్దరినీ పేర్ని నాని దాచారన్న అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అనండం చర్చను నెక్స్ట్ లెవల్కు తీసుకువెళ్ళింది. ఇంత జరుగుతున్నా… వంశీ మాత్రం సైలెంట్ గా ఉండటంతో ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!