Off The Record: ఎర్రబెల్లి భద్రత తొలగింపుతో వరంగల్ ఈస్ట్లో రాజకీయ సెగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ హాట్ రాజకీయాలకు వేదిక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం. ప్రస్తుతం తూర్పు సెగ్మెంట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదీ ఎర్రబెల్లి ప్రదీప్రావు ద్వారా. ప్రదీప్రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోదరుడు. మొన్నటి వరకు అధికారపార్టీలోనే ఉన్నారు. ఈ మధ్యే బీజేపీలోకి జంప్ చేశారు. అప్పటి నుంచి తూర్పులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో ఢీ అంటే ఢీ అంటున్నారు ప్రదీప్రావు. వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేతో ఆయనకు పడేది కాదు. ఇప్పుడు కండువా మార్చేయడంతో వ్యూహాలు మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ ప్రదీప్రావుకు భద్రతగా ఉన్న టు ప్లస్ టు గన్మెన్ను తొలగించారు. తనకు భద్రతను తొలగించడం వెనుక ఎమ్మెల్యే నరేందర్ ఒత్తిడి ఉందనేది ప్రదీప్రావు ఆరోపణ. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారిపోయాయి.
ప్రదీప్రావు 2009లోనే పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2014లో టీఆర్ఎస్ టికెట్ ఆశించినా.. కొండా మురళీ దంపతులు గులాబీ కండువా కప్పుకోవడంతో వాళ్లకోసం ప్రదీప్రావు సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక 2018 ఎన్నికల్లోనూ నిరాశ తప్పలేదు. అప్పటికే వరంగల్ మేయర్గా ఉన్న నన్నపనేని నరేందర్కు పార్టీ టికెట్ ఇచ్చింది. అలాగే దయాకర్రావుకు టికెట్ ఇవ్వడం కూడా ప్రదీప్రావుకు మైనస్గా మారింది. అయితే ప్రదీప్రావును ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడం.. అధికారపార్టీలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తూర్పు టికెట్ రాదనే ఆలోచనతో బీజేపీ కండువా కప్పేసుకున్నారు ప్రదీప్రావు.
Also Read
మొన్నటి వరకు వరంగల్ తూర్పులో ముసుగులో గుద్దులాటలా ఉన్న విభేదాలు.. జెండాలు వేరుకావడంతో ఓపెన్ అయిపోయాయి. ప్రదీప్రావును నేరుగా ఢీకొట్టేందుకు ఎమ్మెల్యే నరేందర్ సిద్ధపడినట్టు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ప్రదీప్రావు, ఎమ్మెల్యే నరేందర్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడు గన్మెన్ను తొలగించడంతో అది పరాకష్టకు చేరిందనేది బీజేపీ నేతల ఆరోపణ. తన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో భద్రత కల్పించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో సెక్యూరిటీ తొలగించారో చెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్రావు అధికారపార్టీలో ఉన్న సమయంలోనే భద్రత తొలగించాలని ఎమ్మెల్యే నరేందర్ విఫలయత్నం చేశారని.. ఇప్పుడు ఆయనకు పని ఈజీ అయ్యిందనే ఒక వాదన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ సమయంలోనే ప్రదీప్రావుకు భద్రత కల్పించారు. తర్వాత కాంగ్రెస్ సర్కార్ సమయంలో ఆయన సెక్యూరిటీని ఉపసంహరించారు. తిరిగి 2016లో తిరిగి భద్రతా కవచంలోకి వచ్చారు ప్రదీప్రావు. ఈ విషయంలో బీజేపీ నేత వాదన ఎలా ఉన్నప్పటికీ.. గన్మెన్ల తొలగింపు అంశం మాత్రం తూర్పులో రాజకీయ సెగలు రేపుతోంది.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!