Off The Record: పేరుకే కూటమి..! ఆ నియోజకవర్గం కూటమిలో కుతకుతలు..
- నెల్లిమర్ల నియోజకవర్గం కూటమిలో కుతకుతలు..
- టీడీపీ, జనసేన మధ్య పతాకస్థాయికి విభేదాలు..
- నెల్లిమర్లను జనసేనకు కేటాయించిన నాటి నుంచే లోకల్ టీడీపీ అసహనం..
- కార్యక్రమాలకు ఆహ్వానాలు లేవని తమ్ముళ్ల ఆగ్రహం..
- జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నేతల జట్టు..
- లోకం నాగమాధవి వర్సెస్ బంగార్రాజు, చంద్ర శేఖర్, రవిశేఖర్గా కోల్డ్వార్..
- మండలాల్లో కాంట్రాక్టులపై ఎమ్మెల్యే ఆర్డర్స్ ఏంటని తమ్ముళ్ల ఫైర్..
- నిత్యావసర వస్తువుల పంపిణీలోనూ భగ్గుమన్న వర్గపోరు ..
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీలో కూటమి నేతల మధ్య వర్గపోరు బయటపడిందని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్సెస్ కర్రోతు బంగార్రాజు, చంద్ర శేఖర్, రవిశేఖర్ గా కోల్డ్వార్ మారిపోయింది.
Also Read
ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వర్గాలను చేసి రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఏ కార్యక్రమాలకు టీడీపీ నాయకులకు ఏలాంటి ఆహ్వానాలు ఉండడంలేదని పార్టీ నాయకులే బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే అనుయాయులకు ఇస్తున్నారన్న వాదన బలంగా ఉంది. మండల స్థాయిలో టీడీపీ నాయకుల పనులు ఏమీ అవ్వడం లేదని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో బహిరంగంగానే పోస్టు పెడుతున్నారు. ఏమాత్రం ప్రజాబలంలేని లోకం మాధవిని దగ్గరుండి గెలిపిస్తే…కనీసం ఖాతరు చెయ్యకపోవడమేటని కార్యకర్తలు సైతం నాయకులను ప్రశ్నిస్తున్నారట. అధినాయకుడి సూచనలతో పనిచేస్తే.. అందర్నీ కరివేపాకులా వాడుకున్నారని నేతలే ఇప్పుడు ఇలా వ్యవహరించడంపై రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి తన స్టైల్లో నియోజకవర్గాన్ని నడపాలని చూస్తున్నారని.. ఎన్నికలప్పుడు మమ్మల్ని శ్రమ పెట్టించారు..ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడిపోతున్నారు. మండలాలలో ఎవరితో పని చేయాలి, ఎవరికీ పని ఇవ్వాలి అన్నది..ఎమ్మెల్యే ఏకపక్షంగా డిక్టేట్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
తాజాగా వరద ప్రభావిత మత్స్యకార గ్రామాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో వర్గపోరు మరోసారి బయటపడింది. ప్రభుత్వం అందించాల్సిన సాయం గురించి స్థానిక టీడీపీ నాయకులకు చెప్పకుండానే ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేపట్టడం…తెలుగు తమ్ముళ్లకు అసలు నచ్చలేదు. కర్రోతు బంగార్రాజు సొంత మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అసమ్మతి బయటపడింది. పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తే ఆటంకాలు సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఇదంతా నాయకులే వెనకుండి నడిపిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం కత్తులు నూరుతోంది. ఇదంతా చూస్తుంటే కూటమికి కూటమి నాయకులే శత్రువులుగా మారారని ఇరు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి నెల్లిమర్లలో కూటమి కంటే కుట్రలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఇలా కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!