Off The Record: బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఉభయ తారకంగా పొలిటికల్ పూనకాల లోడింగ్కు దృష్టి పెట్టారు నేతలు.
Read Also: Off The Record: కోవర్టుల టెన్షన్..? మళ్లీ పాయకరావుపేటపై వంగలపూడి అనిత ఫోకస్
Also Read
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలతో జాతీయస్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, సంఘీభావం ప్రకటించి పార్టీలను బీఆర్ఎస్ సభకు ఆహ్వానించడాన్ని ఆ వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. నేషనల్ లెవల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఒక అజెండాను కూడా ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దాంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పోషించే పాత్రపై అందరికీ స్పష్టత వస్తుందని.. ఊగిసలాటలో ఉన్న పాలు ప్రాంతీయ పార్టీలు సైతం తోడుగా వస్తాయని అనుకుంటున్నారట. సభ ద్వారా బలాన్ని చాటడం.. బీజేపీపై పోరులో తాము ఒంటరి కాదని చెప్పడం కూడా వ్యూహంలో భాగంగా తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మంను ఎంచుకోవడంలోనూ పార్టీ అధిష్ఠానం దూర దృష్టి ఉందనే టాక్ నడుస్తోంది. ఖమ్మం అటు ఆంధ్రప్రదేశ్కు, చత్తీసఘడ్, ఒడిసాలకు చేరువ. ఆయా రాష్ట్రాలకు ఎక్కువ మంది ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తారు. బహిరంగ సభ ప్రభావం ఆయా రాష్ట్రాలపై తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి చిక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే.. 2018లోనూ ఒక శాసనసభ్యుడే విజయం సాధించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొన్నా.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సభను వేదికగా చేసుకుంటారని అభిప్రాయ పడుతున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. భారీ సభ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే.. ఓ పట్టాన మింగుడు పడని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా పాగా వేయడానికి బీఆర్ఎస్ సభ ఉపయోగ పడుతుందని లెక్కలేస్తున్నారట.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..