Off The Record: బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే ఎందుకు ఎంచుకున్నారు?
Off The Record: తెలంగాణలో గులాబీపార్టీ నేతల చూపంతా ప్రస్తుతం 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభపైనే ఉంది. టీఆర్ఎస్– బీఆర్ఎస్గా మారిన తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డితోపాటు మరికొందరు సభా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. దాదాపు ఐదు లక్షల మందిని సమీకరించాలనేది పార్టీ లక్ష్యం. అప్పుడే బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని గులాబీ నేతల ఆలోచన. నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు ప్రణాళికలు రచించారు. ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఉభయ తారకంగా పొలిటికల్ పూనకాల లోడింగ్కు దృష్టి పెట్టారు నేతలు.
Read Also: Off The Record: కోవర్టుల టెన్షన్..? మళ్లీ పాయకరావుపేటపై వంగలపూడి అనిత ఫోకస్
Also Read
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలతో జాతీయస్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, సంఘీభావం ప్రకటించి పార్టీలను బీఆర్ఎస్ సభకు ఆహ్వానించడాన్ని ఆ వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. నేషనల్ లెవల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఒక అజెండాను కూడా ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దాంతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పోషించే పాత్రపై అందరికీ స్పష్టత వస్తుందని.. ఊగిసలాటలో ఉన్న పాలు ప్రాంతీయ పార్టీలు సైతం తోడుగా వస్తాయని అనుకుంటున్నారట. సభ ద్వారా బలాన్ని చాటడం.. బీజేపీపై పోరులో తాము ఒంటరి కాదని చెప్పడం కూడా వ్యూహంలో భాగంగా తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ బహిరంగ సభకు ఖమ్మంను ఎంచుకోవడంలోనూ పార్టీ అధిష్ఠానం దూర దృష్టి ఉందనే టాక్ నడుస్తోంది. ఖమ్మం అటు ఆంధ్రప్రదేశ్కు, చత్తీసఘడ్, ఒడిసాలకు చేరువ. ఆయా రాష్ట్రాలకు ఎక్కువ మంది ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తారు. బహిరంగ సభ ప్రభావం ఆయా రాష్ట్రాలపై తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి చిక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిస్తే.. 2018లోనూ ఒక శాసనసభ్యుడే విజయం సాధించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొన్నా.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సభను వేదికగా చేసుకుంటారని అభిప్రాయ పడుతున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. భారీ సభ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తు అయితే.. ఓ పట్టాన మింగుడు పడని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా పాగా వేయడానికి బీఆర్ఎస్ సభ ఉపయోగ పడుతుందని లెక్కలేస్తున్నారట.
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!