తిరుపతిలో టీడీపీకి కొత్త తలనొప్పి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్!
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభించలేదని బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాయకులకు భజన చేసే వారికే పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. అధిష్ఠానంపై ఆరోపణలు చేయడం ఇష్టంలేని మరికొందరు స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీలను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీకి ఏకైక కార్పొరేటర్గా ఉన్న నాయకుడు కూడా డిమాండ్ చేయడం పార్టీలో చర్చగా మారింది.
రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నవారికి కమిటీలో చోటు?
చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి, మండల కమిటీలను ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ కనిపించని ముఖాలకు కమిటీలలో చోటు కల్పించారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో యాక్టివిటీస్ తగ్గించారు మరికొందరు. టీడీపీలో ఉండాలా వద్దా అని ఇంకొందరు ఊగిసలాడుతున్నారట. పార్టీలో పనిచేసేందుకు కొందరు అయిష్టంగా ఉన్నట్టు టాక్. ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారందరికీ కమిటీలలో పదవులు ఇచ్చారని కేడర్ గుర్రుగా ఉందట.
వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని గుర్తించలేదా?
రెండేళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని కమిటీలలోకి తీసుకోలేదట. సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ ఎంపికలపైనే తమ్ముళ్లు పార్టీ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట. వీరికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఏకైక కార్పొరేటర్ మునికృష్ణ జత కలిశారట. కష్ట పడేవారికి టీడీపీలో గుర్తింపు లేదా అని ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదట. టీడీపీలో ఉంటూ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడంపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు దిద్దుబాటు చేపడతారో లేక కేడర్ వేదన ఆరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.
- Tags
- off the record
- tdp
- Tirupati
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి