తిరుపతిలో టీడీపీకి కొత్త తలనొప్పి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభించలేదని బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాయకులకు భజన చేసే వారికే పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. అధిష్ఠానంపై ఆరోపణలు చేయడం ఇష్టంలేని మరికొందరు స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీలను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీకి ఏకైక కార్పొరేటర్గా ఉన్న నాయకుడు కూడా డిమాండ్ చేయడం పార్టీలో చర్చగా మారింది.
రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నవారికి కమిటీలో చోటు?
చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి, మండల కమిటీలను ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ కనిపించని ముఖాలకు కమిటీలలో చోటు కల్పించారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో యాక్టివిటీస్ తగ్గించారు మరికొందరు. టీడీపీలో ఉండాలా వద్దా అని ఇంకొందరు ఊగిసలాడుతున్నారట. పార్టీలో పనిచేసేందుకు కొందరు అయిష్టంగా ఉన్నట్టు టాక్. ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారందరికీ కమిటీలలో పదవులు ఇచ్చారని కేడర్ గుర్రుగా ఉందట.
వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని గుర్తించలేదా?
రెండేళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని కమిటీలలోకి తీసుకోలేదట. సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ ఎంపికలపైనే తమ్ముళ్లు పార్టీ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట. వీరికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఏకైక కార్పొరేటర్ మునికృష్ణ జత కలిశారట. కష్ట పడేవారికి టీడీపీలో గుర్తింపు లేదా అని ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదట. టీడీపీలో ఉంటూ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడంపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు దిద్దుబాటు చేపడతారో లేక కేడర్ వేదన ఆరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.
- Tags
- off the record
- tdp
- Tirupati
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!