తిరుపతిలో టీడీపీకి కొత్త తలనొప్పి!
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్!
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లభించలేదని బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాయకులకు భజన చేసే వారికే పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు తమ్ముళ్లు. అధిష్ఠానంపై ఆరోపణలు చేయడం ఇష్టంలేని మరికొందరు స్తబ్దుగా ఉండిపోయారు. ప్రస్తుతం ప్రకటించిన కమిటీలను రద్దు చేయాలని తిరుపతిలో టీడీపీకి ఏకైక కార్పొరేటర్గా ఉన్న నాయకుడు కూడా డిమాండ్ చేయడం పార్టీలో చర్చగా మారింది.
రెండేళ్లుగా టీడీపీకి దూరంగా ఉన్నవారికి కమిటీలో చోటు?
చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తెలుగు యువత, తెలుగు విద్యార్థి, మండల కమిటీలను ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ కనిపించని ముఖాలకు కమిటీలలో చోటు కల్పించారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్తబ్దుగా ఉండిపోయారు. రాజకీయ ఒత్తిళ్లతో యాక్టివిటీస్ తగ్గించారు మరికొందరు. టీడీపీలో ఉండాలా వద్దా అని ఇంకొందరు ఊగిసలాడుతున్నారట. పార్టీలో పనిచేసేందుకు కొందరు అయిష్టంగా ఉన్నట్టు టాక్. ఇలాంటి కేటగిరీల్లో ఉన్నవారందరికీ కమిటీలలో పదవులు ఇచ్చారని కేడర్ గుర్రుగా ఉందట.
వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని గుర్తించలేదా?
రెండేళ్లుగా వైసీపీపై పోరాటం చేస్తున్నవారిని కమిటీలలోకి తీసుకోలేదట. సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ ఎంపికలపైనే తమ్ముళ్లు పార్టీ నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట. వీరికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఏకైక కార్పొరేటర్ మునికృష్ణ జత కలిశారట. కష్ట పడేవారికి టీడీపీలో గుర్తింపు లేదా అని ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం లేదట. టీడీపీలో ఉంటూ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడంపై నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి.. చంద్రబాబు దిద్దుబాటు చేపడతారో లేక కేడర్ వేదన ఆరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.
- Tags
- off the record
- tdp
- Tirupati
తాజావార్తలు
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!