Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Mla Etela Rajender Hot Topic In Modi Hyderabad Tour

Modi Tour etela:మోడీ టూర్.. ఈటలకు పెద్దపీట వేశారా?

Published Date :February 10, 2022 , 9:16 pm
By NTV WebDesk
Modi Tour etela:మోడీ టూర్.. ఈటలకు పెద్దపీట వేశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరిగిందా? ప్రధానిని ఎవరు రిసీవ్‌ చేసుకోవాలి.. ఇంకెవరు వీడ్కోలు చెప్పాలన్నదానిపై తర్జనభర్జన పడ్డారా? చివరిక్షణం వరకు జాబితాలో మార్పులు తప్పలేదా? ఈ విషయంలో అసంతృప్తి ఉన్నదెవరికి? సంతోషం కలిగిందెవరికి?

మోడీ టూర్‌లో చివరిక్షణం వరకు బీజేపీ ప్రొటోకాల్ జాబితాలో మార్పులు
ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పగానే బీజేపీ నాయకులు.. కార్యకర్తల్లో చాలా ఫీలింగ్స్‌ కలుగుతాయి. ఇక ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం వస్తే.. బీజేపీ బ్యాచ్‌కు కలిగే ఆ ఆనందమే వేరు. ఇటీవల మోడీ హైదరాబాద్‌ పర్యటనలో అదే జరిగిందట. కాకపోతే ప్రధానికి పార్టీ తరఫున ఎవరెవరు స్వాగతం పలకాలి.. వీడ్కోలు చెప్పేదెవరు అనేదానిపై పెద్ద చర్చే జరిగిందట. ప్రధాని పర్యటన ముగిసేవరకు లాస్ట్‌ మినిట్‌ వరకు పార్టీ ప్రొటోకాల్‌ లిస్ట్‌లో మార్పులు చేర్పులు చేశారట. దానిపైనే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

దాదాపు 70 మంది బీజేపీ నేతలు మోడీని కలిశారా?
ప్రధాని మోడీ ఎప్పుడు హైదరాబాద్‌ వచ్చినా బీజేపీ ముఖ్య నాయకులే కలిసి మాట్లాడతారు. భారీగా వస్తాం.. స్వాగతాలు చెబుతాం.. ఘనంగా వీడ్కోలు పలుకుతాం అని అంటే ప్రధాని సెక్యూరిటీ అనుమతించదు. అలాంటిది దాదాపుగా 70 మంది వరకు బీజేపీ నేతలు ఈ దఫా టూర్‌లో మోడీని కలిసే అవకాశం లభించిదట. భారీ జాబితా కావడంతో ఎవరు ఎక్కడ ఉండాలన్న దానిపై కొంత కసరత్తు చేసి ప్లేస్‌లు ఫైనల్‌ చేసేశారట. కానీ.. ఆ లిస్ట్‌ చూశాక కొందరు బీజేపీ నాయకులు పెదవి విరిచారట. మేము అక్కడ ఉండాలా? అదేంటి.. పార్టీలో మా ప్రాధాన్యం అంతేనా? సీనియర్లకు సరైన గుర్తింపు లేకపోతే ఎలా? అంటూ చాలా ప్రశ్నలే వచ్చాయట. దాంతో పార్టీలో ప్రొటోకాల్ రగడ పెద్దది కాకుండా వెంటనే సర్దుబాటు చేసినట్టు సమాచారం.

జాతీయస్థాయి బాధ్యతల్లో ఉన్నవారి పేర్లు రిసీవింగ్‌లో లేవా?
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీ ల్యాండైంది మొదలు.. ఇక్రిశాట్‌, ముచ్చింతల్‌ పర్యటనల వరకు రిసీవింగ్‌ జాబితాలో ఎవరు ఉండాలి.. వీడ్కోలు చెప్పేటప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించారట. బీజేపీలో జాతీయస్థాయిలో బాధ్యతలు ఉన్నవారిని శంషాబాద్‌లో ప్రధాని మోడీకి స్వాగతం పలికే జాబితాలో పెట్టలేదట. దానిపై ప్రశ్నలు రావడంతో వెంటనే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్లు తొలుత ప్రధాని మోడీని రిసీవ్‌ చేసుకునే లిస్ట్‌లో లేవట. కానీ.. ప్రధానికి స్వాగతం పలికిన వారిలో వారిద్దరూ ఉన్నారు. అలాడే మోడీకి వీడ్కోలు చెప్పే బీజేపీ నేతల జాబితాలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేరు లేదట. కానీ.. ఆయన ప్రధానికి వీడ్కోలు చెబుతున్న బీజేపీ నేతల వరసలో కనిపించారు. ఇలా చాలా మంది పేర్లు అటూ ఇటూ అయినట్టు పార్టీ వర్గాల కథనం.

ప్రొటోకాల్ పేరుతో కొందరికే బీజేపీలో ప్రాధాన్యం?
పార్టీ తరఫున ప్రొటోకాల్‌ పాటించే క్రమంలో కొందరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని.. మరికొందరికి బీజేపీలో ప్రొటోకాల్‌ పోస్ట్‌ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్య నేతలను ఒకే దగ్గర కాకుండా వేర్వేరు చోట్ల ఉంచామని సర్ది చెబుతున్నారట కమలనాథులు. కాకపోతే ప్రధానికి స్వాగతం.. వీడ్కోలు చెప్పిన ప్రతిచోటా బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో కనిపించడం ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. మోడీ టూర్‌ మొత్తం బీజేపీ కార్యక్రమంగా మార్చేశారనే విమర్శలు తప్పలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp seniors
  • Etela Rajender
  • MODI HYDERABAD TOUR
  • off the record
  • PM Modi

తాజావార్తలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions