ఇకపై లెక్క మరోలా ఉంటుందని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం రోజా మంత్రి కావడంతో నగరి వైసీపీలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది.
నగరి వైసీపీలో కేజే కుమార్, అమ్ములు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి వర్గాలు మంత్రి రోజాకు వ్యతిరేకం. వీరందరికీ పదవులు రావడం వెనక మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి ఆశీసులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే రోజాను ఓపెన్గానే సవాల్ చేసేవారు అసమ్మతి నేతలు. వచ్చే ఎన్నికల్లో రోజా ఎలా గెలుస్తారో చూస్తామన్న సవాళ్లు విసిరారు.వారివెనక ఎవరున్నా.. రోజా గట్టిగానే కౌంటర్ ఇచ్చేవారు. ఇప్పుడు మంత్రి కావడంతో తగ్గేదే లేదన్నట్టుగా దూసుకెళ్లే ప్లానింగ్లో ఉంది రోజావర్గం.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
మూడేళ్లుగా నగరిలో ఎదురైన చేదు అనుభవాలకు రివెంజ్ తీర్చుకునే పనిలో ఉన్నారట రోజా అండ్ కో. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టుగా వార్నింగ్లు ఇస్తున్నారట. మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గాలకు నేరుగానే హెచ్చరికలు చేస్తున్నారట. దీంతో రానున్న రోజుల్లో నగరిలో ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోందట. ఎవరి దగ్గరకు వెళ్లితే ఎవరికి కోపం వస్తుందో అని కలవర పడుతున్నారట.
నిన్న మొన్నటి వరకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి పేర్లు చెప్పి పనులు చేయించుకొనేవాళ్లు వారి వర్గాలు. ఇప్పుడు రోజానే మంత్రిగా రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైందట. ముగ్గురు మంత్రుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తలచుకుని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరిలో ఏ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కలిసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. రాబోయే కష్టాలను ఊహించుకొని కొందరు ఉద్యోగులు నగరి నుంచి వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అటు కేడర్.. ఇటు ఉద్యోగుల తీరు చర్చగా మారింది. మరి.. రానున్న రోజుల్లో నగరి పార్ట్-2 రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!