Off The Record: కాళేశ్వరం కేసును సీబీఐ టేకప్ చేయదా? సర్కార్ కొత్త ప్లాన్
- కాళేశ్వరం కేసులో ముగ్గురు అధికారుల పాత్రపై ఏసీబీ దర్యాప్తు..
- మొత్తం 33మందికి సంబంధించిన నివేదిక..
- ఓవైపు సీబీఐకి అప్పగించి మళ్ళీ ఏసీబీ దూకుడు ఎందుకు?..
- అవినీతిలో ఆ 33మంది పాత్ర ఉన్నట్టు తేల్చిన విజిలెన్స్..
- ముగ్గురు అధికారుల ఆస్తులు వెయ్యి కోట్లకు పైనే..
- 33మందిపై విచారణ కోసం ప్రభుత్వానికి ఏసీబీ లేఖ..
- సీబీఐకి లేఖ రాసినా ఇప్పటిదాకా నో రియాక్షన్..
- సీబీఐ టేకప్ చేస్తుందో లేదోనన్న డౌట్స్ ఉన్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు దర్యాప్తులో ఏం జరుగుతోంది? ఓవైపు కేసును సీబీఐకి అప్పగిస్తూనే…మరోవైపు ఏసీబీ దూకుడు పెంచడాన్ని ఎలా చూడాలి? కేసును సీబీఐ టేకప్ చేస్తుందా లేదా అన్న డౌట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయా? అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎక్స్ట్రా ఎంతమంది అధికారులకు సంబంధించిన సమాచారం కొత్తగా వచ్చింది?
Read Also: Pakistan Foreign Loans: ప్రపంచ దేశాలకు వంగి వంగి దండాలు పెడుతున్న పాక్.. దాని కోసమేనా?
Also Read
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏసీబీలో ముగ్గురు అధికారుల అవినీతిపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో స్టేట్ విజిలెన్స్ ఒక నివేదికను ఏసీబీకి పంపింది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 33 మంది అక్రమార్కులు ఉన్నారని, వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలని కోరింది. ఆ మేరకు విచారణకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. అయితే ఇక్కడే ఒక ప్రాధమికమైన ప్రశ్న వస్తోంది అందరికీ. ఓవైపు సీబీఐ దర్యాప్తు కోరుతూనే.. మరోవైపు ఏసీబీ విచారణలో దూకుడు పెంచడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇప్పటికే 33 మంది అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. అవినీతిలో వాళ్ళ పాత్ర ఉన్నట్లు నిగ్గు తేల్చింది. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు కీలక అధికారుల మీద కేసులు బుక్ అయ్యాయి.
Read Also: Dangerous Stunts on Road: ఇవే తగ్గించుకుంటే మంచిది.. స్కూటీపై స్టంట్స్ చేస్తూ యువకుడి రచ్చ రచ్చ
అయితే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. ఆ ముగ్గురి ఆస్తులు కలిపి దాదాపు వెయ్యి కోట్లకుపైనే ఉంటాయని తేల్చారు అధికారులు. ఈ క్రమంలోనే… ఇటీవల విజిలెన్స్ కమిషన్ తన నివేదికను ఏసీబీకి పంపించింది. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోమని కోరింది. అయితే డైరెక్ట్గా ఒక డిపార్ట్మెంట్ సిఫారసు చేస్తే.. ఏసీబీ కేసులు నమోదు చేయరు. అందుకే ఏసీబీ నేరుగా ప్రభుత్వానికి లేఖ రాసిందట. విజిలెన్స్ శాఖ నుంచి నివేదిక వచ్చిందని, అందులో 33 అధికారుల అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉందని, వాళ్ళని విచారించేందుకు అనుమతించాలని కోరింది.
Read Also: Tilak Verma: రేవంత్రెడ్డిని కలిసిన తిలక్ వర్మ.. సీఎంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తిలక్..
ఇక, ప్రభుత్వం ఈ ఫైల్ని పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఏసీబీ దూకుడు పెంచి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అటు సీబీఐ నుంచి ఇంకా సమాచారం రావాల్సిఉంది. ప్రభుత్వం లేఖ రాసినా.. ఇప్పటిదాకా అట్ముంచి నో రియాక్షన్. అందులో కూడా రాజకీయ నాయకులతో పాటు అధికారుల అక్రమాల చిట్టా ఉందట. అయితే ఒకవైపు కేంద్ర హోం శాఖ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండగానే…ఏసీబీ దూకుడు పెంచడంలో అర్థం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. ఇన్ని రోజుల నుంచి రియాక్షన్ లేకపోవడంతో… ఒకవేళ సీబీఐ కేసు టేకప్ చేయకపోతే ఎలాగన్న డౌట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా అన్న చర్చ మొదలైంది. ఎటుపోయి ఎటొచ్చినా దర్యాప్తులో తేడా పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోందా అన్న సందేహాలు వస్తున్నాయట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!