ఉమ్మడి నల్లగొండజిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు?
మోత్కుపల్లి చేరికతో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి ఉందా అని ఆరా తీస్తున్నారట. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితమని.. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు కలిసి పనిచేశామని సీఎం కేసీఆర్ చెప్పడంతో.. ఆ మాటల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియక దిగులు చెందుతున్నారట ఎమ్మెల్యేలు.
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లికి ప్రాధాన్యం..!
మోత్కుపల్లి గతంలో ఆలేరు, తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ కుదురుకోలేదు. దళితబంధు బ్యాక్డ్రాప్లో కాషాయాన్ని వీడి.. గులాబీ శిబిరానికి దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు ఈ మాజీ మంత్రి. ఇప్పుడు మోత్కుపల్లికి టీఆర్ఎస్లో ఇచ్చే ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. కండువా కప్పిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లి ఆయన పక్కనే కనిపించారు. ఆ దృశ్యాలు చూశాక ఎమ్మెల్యేలకు ఇంకా టెన్షన్ పెరిగిందట.
ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఒక్కటే చర్చ..!
దళితబంధు కార్పొరేషన్కు మోత్కుపల్లిని ఛైర్మన్ను చేస్తారో లేక ఎమ్మెల్సీని చేస్తారో క్లారిటీ లేదుకానీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. పరిస్థితి ఏంటన్న చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు తుంగతుర్తి, నకిరేకల్ ఉన్నాయి. ఆలేరు జనరల్ స్థానం. వీటిల్లో ఏదోఒకటి మోత్కుపల్లికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆంతరంగిక సమావేశాల్లో చర్చిస్తున్నారట. అంత సీన్ లేదన్నది మరికొందరి వాదన. నామినేటెడ్ పదవి కట్టబెట్టి దాని వరకే మోత్కుపల్లిని పరిమితం చేస్తారని చెబుతున్నారట. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ముందుగానే ఒక అంచనాకు రాకుండా.. తమ కాళ్ల కిందకు నీళ్లొచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా అని తెలిసిన వారి దగ్గర ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!