ఉమ్మడి నల్లగొండజిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు?
మోత్కుపల్లి చేరికతో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి ఉందా అని ఆరా తీస్తున్నారట. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితమని.. ఇద్దరం కలిసి చాలా ఏళ్లు కలిసి పనిచేశామని సీఎం కేసీఆర్ చెప్పడంతో.. ఆ మాటల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియక దిగులు చెందుతున్నారట ఎమ్మెల్యేలు.
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లికి ప్రాధాన్యం..!
మోత్కుపల్లి గతంలో ఆలేరు, తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అక్కడ కుదురుకోలేదు. దళితబంధు బ్యాక్డ్రాప్లో కాషాయాన్ని వీడి.. గులాబీ శిబిరానికి దగ్గరయ్యారు. సీఎం కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు ఈ మాజీ మంత్రి. ఇప్పుడు మోత్కుపల్లికి టీఆర్ఎస్లో ఇచ్చే ప్రాధాన్యంపై ఆసక్తి నెలకొంది. కండువా కప్పిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో మోత్కుపల్లి ఆయన పక్కనే కనిపించారు. ఆ దృశ్యాలు చూశాక ఎమ్మెల్యేలకు ఇంకా టెన్షన్ పెరిగిందట.
ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఒక్కటే చర్చ..!
దళితబంధు కార్పొరేషన్కు మోత్కుపల్లిని ఛైర్మన్ను చేస్తారో లేక ఎమ్మెల్సీని చేస్తారో క్లారిటీ లేదుకానీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటే.. పరిస్థితి ఏంటన్న చర్చ అయితే మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు తుంగతుర్తి, నకిరేకల్ ఉన్నాయి. ఆలేరు జనరల్ స్థానం. వీటిల్లో ఏదోఒకటి మోత్కుపల్లికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆంతరంగిక సమావేశాల్లో చర్చిస్తున్నారట. అంత సీన్ లేదన్నది మరికొందరి వాదన. నామినేటెడ్ పదవి కట్టబెట్టి దాని వరకే మోత్కుపల్లిని పరిమితం చేస్తారని చెబుతున్నారట. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ముందుగానే ఒక అంచనాకు రాకుండా.. తమ కాళ్ల కిందకు నీళ్లొచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా అని తెలిసిన వారి దగ్గర ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!