OTR: ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత.. సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా?
- పనుల కోసం పెమ్మసాని దగ్గరికే వెళ్తున్న ఎక్కువ మంది
- గుంటూరు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర మంత్రి కనుసన్నల్లోనే
- పెమ్మసాని దూకుడుతో ఎమ్మెల్యేలు డమ్మీ అవుతున్నారా?
- శంకర్విలాస్ ఆర్వోబీ స్థానంలో కొత్త బ్రిడ్జి
- కోర్ట్ కేసులతో నిర్మాణ పనులు ఆలస్యం
- మంత్రి పెమ్మసానివల్లే ఆలస్యం అంటూ వైసీపీ రివర్స్
- గుంటూరుకు పట్టిన శని అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు
- పార్టీ నేతల నుంచి పెద్దగా రియాక్షన్ లేదంటూ టీడీపీ కేడర్ ఆశ్చర్యం
- వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా మొక్కుబడిగా స్పందించిన ఎమ్మెల్యేలు
- నేతల మధ్య అంతర్గ విభేదాలే కారణం అన్న డౌట్స్
- పెమ్మసాని వైఖరి మింగుడుపడకే ఎమ్మెల్యేలు అలా ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ టీడీపీ నేత సొంత గల్లీలో ఒంటరి పోరాటం చేస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళు మనం మనం బరంపురం అని పైకి అంటున్నా… లోపల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? ముందొచ్చిన చెవులకంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటూ కామ్ అయిపోతున్నారా? ఎవరా లీడర్? సొంత పార్టీలోనికి కొందరు ఆయన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పెద్ద పదవులు దక్కించుకోగలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నారైగా ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, వస్తూనే టీడీపీ గుంటూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి సాధించారాయన. అదంతా ఒక ఎత్తయితే… ఢిల్లీ స్థాయిలో పరపతి సాధించిన పెమ్మసానికి సొంత గల్లీలో సరైన సహకారం లభించడం లేదన్నది లేటెస్ట్ టాక్. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒకరకంగా ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారాయన. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… గుంటూరు టీడీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలను వదిలేసి ఏ పని కావాలన్నా పెమ్మసాని దగ్గరకు వెళ్తున్నారన్నది సైకిల్ సౌండ్. ఇక గుంటూరు నగరానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలైతే… దాదాపు అన్నీ పెమ్మసాని కనుసన్ననల్లోనే జరుగుతున్నాయి. గెలిచిన మొదట్లో ప్రతి శని, ఆదివారాలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం, జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్షలు నిర్వహించడం లాంటివి చేసేవారు కేంద్ర మంత్రి. గుంటూరు ప్రభుత్వాసుపత్రి, మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని శాఖల అధికారులతో మాట్లాడుతూ పనులు చక్కబెట్టేవారాయన. ఈ దూకుడుతో.. ఒక రకంగా ఎమ్మెల్యేలు డమ్మీలైపోయారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ ఊపులోనే… గుంటూరులో ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణమవుతున్న శంకర్ విలాస్ ఆర్వోబీ స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెట్టారు ఎంపీ.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
అంతేకాదు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పనులు మొదల్యయాయి, పాత బ్రిడ్జిని కూల్చేశారు. విస్తరణ పనుల్లో స్థలాలు కోల్పోయేవారు కొందరు కోర్టు మెట్లు ఎక్కడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. సరిగ్గా ఇక్కడే మేటర్లోకి వైసీపీ ఎంటరైపోయింది. పనులు నత్త నడకన నడుస్తున్నాయని, కొత్తదాని సంగతి తర్వాత… ముందు ఉన్న వంతెనను కూల్చేసి ట్రాఫిక్ ఇబ్బందులతో జనానికి నరకం చూపిస్తున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. అక్కడితో ఆగితే అది వేరే సంగతి. అసలీ ఇబ్బందులన్నిటికీ కేంద్రమంత్రి పెమ్మసానే కారణమంటూ ధ్వజమెత్తారు ప్రతిపక్ష నాయకులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే… ఏకంగా పెమ్మసాని మీద పర్సనల్ అటాక్ చేశారు. ఆయన గుంటూరుకు పట్టిన శని అని, అహంకారం పెరిగిపోయి, తాను చెప్పిందే చెయ్యాలన్నట్లు ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా… పర్సనల్గా చేసిన శని కామెంట్స్ కలకలం రేపాయి. అదే సమయంలో అంబటి కామెంట్స్పై స్పందించేందుకు నిరాకరించారు పెమ్మసాని. జిల్లాలోని ఇతర టీడీపీ నాయకుల నుంచి కూడా కనీస స్పందన లేకపోవడమే చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మంత్రి మీద అంబటి ఆ స్థాయిలో విరుచుకుపడితే… కనీసం ఒక్కరంటే ఒక్క ముఖ్య నాయకుడు కూడా రియాక్ట్ అవకపోవడం ఏంటని టీడీపీ కేడరే ఆశ్చర్యపోతోందట.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి అంబటి ఆరోపణలపై మాట్లాడారు. అప్పుడు కూడా… అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారే తప్ప సొంతపార్టీ ఎంపీని విమర్శిస్తే తనంతట తానుగా రియాక్ట్ అవలేదు. ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అయితే ప్రెస్ నోట్ తోపాటు ఓ వీడియో రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని లైట్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రిని అంబటి రాంబాబు వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన ఎమ్మెల్యేలు, నేతలు మొక్కుబడి రియాక్షన్స్తో సరిపెట్టడం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఎందుకలాగని కాస్త లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకు మాత్రం అంతర్గత విభేదాలే కారణమని అర్ధమవుతోందట. తన లోక్సభ నియోజకవర్గం పరిధిలో పెమ్మసాని అంతా తానై వ్యవహారాలు నడిపిస్తుండడం కొంతమంది ఎమ్మెల్యేలకు అస్సలు మింగుడు పడటం లేదని అంటున్నారు. అందుకే… ఆయన్ని ఎవరేమంటే మాకెందుకన్నట్టుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో… జిల్లా పాలిటిక్స్లో పెమ్మసాని ఒంటరి అవుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి పరిశీలకులకు. మొత్తం మీద అంబటి విమర్శలతో టీడీపీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని, కలిసి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు జిల్లాలో.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!