Telangana Politics : తెలంగాణ బీజేపీ నేతలకు పెరుగుతున్న ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిషన్ ఇంపాజిబుల్లో తెలంగాణ బీజేపీ నేతలది కీలక పాత్రా..? లక్ష్మణ్కు దక్కిన ప్రాధాన్యం అందులో భాగమా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ సమీకరణాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి?
బీజేపీ కేంద్ర నాయకత్వంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకునే ఇటీవల నిర్ణయాలు తీసుకోవడం చర్చగా మారుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలనే వ్యూహంలో భాగంగా చకచకా పావులు కదుపుతోంది అధిష్ఠానం. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్లలో రాష్ట్ర బీజేపీ నేతలకు చోటు కల్పించింది అగ్రనాయకత్వం. హైదరాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆ దూకుడు ఇంకా పెరిగిందనే చెప్పాలి. కాకపోతే అందులోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం.. కమలనాథులనే ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి.
Also Read
తాజాగా డాక్టర్ కె. లక్ష్మణ్కు.. బీజేపీ అత్యున్నత నిర్ణయాక మండలి పార్లమెంటరీ కమిటీతోపాటు.. ఎన్నికల కమిటీలోనూ చోటు ఇచ్చారు. ఇటీవలే ఆయన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారు. ఇప్పుడు కొత్త బాధ్యతల్లోకి తీసుకున్నారు. దీంతో లక్ష్మణ్కు ఇస్తున్న ప్రాధాన్యంపై పార్టీలోనే పెద్ద చర్చగా మారింది. గతంలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెల్చినా.. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో పార్టీ పుంజుకుంది. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన తర్వాత లక్ష్మణ్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపించాయి. ఇంతలోనే బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ పేరును ప్రకటించడంతో.. అనూహ్యంగా పొలిటికల్ టర్న్ వచ్చింది. అప్పటి నుంచి జాతీయ నాయకుడిగా దేశమంతా పర్యటనలు చేస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ తీరిక లేకుండా గడిపారు.
తెలంగాణలో బీసీలు ఎక్కువ. అందులో మున్నూరు కాపు సామాజికవర్గం కూడా ఎక్కువే. లక్ష్మణ్ అదే సామాజికవర్గం. రాష్ట్రంలో బలపడటానికి బీసీలు కీలకంగా పరిగణిస్తున్న బీజేపీ ఆ వర్గానికి చెందిన వారికి పదవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ కూడా అదే సామాజికవర్గం. దాంతో రాష్ట్రంలో బీసీలకు బీజేపీ దగ్గరనే సంకేతాలు ఇస్తున్నారు కమలనాథులు. బీజేపీ అత్యున్నత నిర్ణయాక మండలిలో చోటు మామూలు విషయం కాదన్నది పార్టీ నేతలు చెప్పేమాట. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ ఆ కమిటీలో ఉండేవారు. తర్వాత వెంకయ్య నాయుడు వంతు వచ్చింది. ఇప్పుడు లక్ష్మణ్ టర్న్ రావడంతో.. తెలంగాణ నుంచి ఎంపికైన తొలి నేతగా పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. బీజేపీలో కాంట్రవర్సీ కాకపోవడం.. పార్టీలో అందరూ ఆయన్ని గౌరవించడం కూడా లక్ష్మణ్కు ప్లస్ అయ్యిందని టాక్.
బీజేపీలో పదవులు వస్తేనే సంబరం కాదు. ఆమేరకు పనితనం కూడా చూపించాలి. ఆ సమర్థత లక్ష్మణ్కు ఉందని జాతీయ నాయకత్వం గుర్తించినా.. తెలంగాణలో బీజేపీ బలపడేలా చేయడం మిషన్ ఇంపాజిబుల్గానే కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. మరి.. బీజేపీ ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని లక్ష్మణ్ ఏవిధంగా చేరుకుంటారో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!