YCP : తండ్రి అధికార పార్టీలో ఉంటే…కూతురు ప్రతిపక్షంలో ఉంటుందా..? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వై.సి.పి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే అనం రామనారాయణ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం..అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో టిడిపిలో చేరారు. చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి కూడా ఇవ్వకపోవడం..కీలక సమావేశాలకు ఆహ్వానించక పోవడంతో కినుకు వహించారు. 2019 ఎన్నికల సమయంలో వై.సి.పి.లో చేరి అనూహ్యంగా వెంకటగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీలో తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించినా.. అది జరగలేదు. తాను రాజకీయాల్లోకి తెచ్చిన అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి లభించడం అనం కు రుచించలేదు. నెల్లూరు నగర రాజకీయాల్లో గతంలో చురుకైన పాత్ర పోషించిన ఆనం వర్గం.. అనిల్ జోరు ముందు రాజకీయాల నుంచి తాత్కాలికంగా దూరమయ్యారు. అంతేకాకుండా నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఇద్దరు..ముగ్గురు పోటీ చేసే అవకాశం ఉందని గతంలోనే అనం చెప్పారు. ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతామనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యం లోనే అనం కుమార్తె అనం కైవల్య ..టీడీపి నేత నారా లోకేష్ తో భేటీ కావడం కలకలం రేపింది. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న కైవల్య…ఆత్మకూరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ తో సమావేశమైనట్లు తెలిసింది. కైవల్య.. బద్వేలులో ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత బిజివేముల వీరారెడ్డి కుటుంబంలో కోడలిగా ఉన్నారు. తమ కుటుంబం టిడిపిలో ఉండటంతో తాను కూడా టిడిపి లోకే వెళుతున్నట్లు తన సన్నిహితులతో కైవల్య అంటున్నారు.
కైవల్య టిడిపి వైపు వెళుతుండటంతో ఎం.ఎల్.ఏ.అనం రామనారాయణ రెడ్డి కూడా ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదట అనం కైవల్య పార్టీలో చేరుతారని…అనంతరం అనం వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద టిడిపి నేత లోకేష్ తో సమావేశమై జిల్లా రాజకీయాల్లో అనం కైవల్య అలజడి సృష్టించారు.
Also Read
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!