అవినీతిలో గుంటూరు రవాణా అధికారుల తీరే వేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్కమ్కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రైవేట్ ట్రావెల్స్తో సొంత ఒప్పందాలు?
Also Read
అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ ప్రచారాలను బలపరిచేలా ఉంటాయి. సెంటీమీటర్ సంధు ఇస్తే.. కిలోమీటర్ దూసుకెళ్లే ఘనులు ఉన్న డిపార్ట్మెంట్. అక్కడ పనోళ్లకు కొదవేం లేదు. ఆ విధంగా గుంటూరు రవాణా అధికారులు చర్చల్లోకి వచ్చారు. కరోనాతో దెబ్బతిన్న సొంత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు ఏకంగా ట్రావెల్ ఏజెంట్లు.. వెహికల్ యజమాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి అధికారులు చెప్పినదానికి ప్రైవేట్ ట్రావెల్స్ ఖుషీ!
ప్యాసింజర్ క్యారియర్గా తిరిగేందుకు ఏ వాహనాన్నైనా వాడుకోండి.. తమకు ఇచ్చేది ఇస్తే చాలు అని చెప్పి డీల్ చేసుకున్నారట. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఎగిరి గెంతేశారట. వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్స్లో వాహనాలు తిప్పాలంటే ఆ వెహికల్స్కు తప్పనిసరిగా యల్లో నెంబర్ ప్లేట్స్ ఉండాలి. వాటికి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. మూడు నెలలకోసారి రోడ్ ట్యాక్స్ కట్టాలి. బోర్డర్ పన్నులు.. ఫిట్నెస్ టెస్ట్లు సరేసరి. వచ్చే ఆదాయంలో వాహన యజమానులకు మిగిలేది తక్కువ. దీంతో రవాణా అధికారులు చెప్పిన డీల్కు ఓకే చెప్పేశారట ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఒక్కో వాహనానికి రూ.5 వేలు వసూలు!
అవినీతి అధికారులు ఇచ్చిన హామీతో రోడ్డెక్కిన 50 వేల వాహనాలు?
ఇటీవల ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలకు ఏడాదికి 24 వేలు కడితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించుకునే వీలు కల్పించింది. దీంతో ఈ వెసులుబాటును అనుకూలంగా మలుచుకున్నారట అవినీతి అధికారులు. ఒక్కో వెహికల్కు ఏడాదికి 5 వేల చొప్పున ఇస్తే.. ఏదైనా చేసుకోవచ్చని.. తాము పట్టుకోబోమని సెలవిచ్చారట. ఆ మాట వినగానే ఎల్లో నెంబర్ ప్లేట్ వాహనాలను పక్కన పెట్టి.. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రోడ్డెక్కించేశారు టావెల్స్ యజమానులు. ఈ విధంగా ఒక్క గుంటూరు పరిధిలోనే 50 వేల వాహనాలు రయ్మని రోడ్లపై పాసింజర్ కారియర్లుగా దూసుకెళ్తున్నాయి. కరోనా వల్ల ఆదాయానికి గండిపడి విలవిల్లాడుతున్న అధికారులు.. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఈ విధంగా వాడేసుకున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. సొంత ఖాజానా నింపుకొనేందుకు పోటీ!
నిజానికి కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. దాని నుంచి బయట పడేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు పాలకులు. కానీ.. వాటికీ చిల్లుపెట్టి సొంత జేబులు నింపుకొంటున్నారు అవినీతి ఘనులు. క్రషర్లకు వెళ్తున్న లారీల నుంచి కూడా స్పెషల్ కరోనా ట్యాక్స్ వసూలు చేస్తున్నారట. మొత్తానికి తమ అవినీతికి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అక్రమార్కులను చూసి ఇతర ప్రభుత్వ విభాగాల వాళ్లు నోళ్లెళ్ల బెడుతున్నారట.
తాజావార్తలు
-
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్డే’ ప్రోమో
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!