chittoor : సొంత ఇంటి నిర్మాణం కోసం ఒకేసారి అడుగులు వేస్తున్న మాజీ ముఖ్యమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా చంద్రబాబు నాయుడు.. నల్లారి కిరణ్ కుమార్రెడ్డి. ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే. నియోజకవర్గాలు.. పార్టీలు వేరైనా చిత్తూరు జిల్లా వాసులే. ఇద్దరికీ జిల్లాలో సొంత ఊళ్లల్లో తాతల కాలం నాటి ఇళ్లు ఉన్నాయి. ఇద్దరూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న పరిస్థితి లేదు. కానీ.. వివిద కారణాలతో చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేసారి సొంత ఇంటి నిర్మాణం దిశగా అడుగులు వేయడం ఆసక్తిగా మారింది.
ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలోని నారావారిపల్లె. ఆయన మాత్రం మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నియోజకవర్గం కుప్పం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా.. విపక్ష నేతగా ఉన్నా.. కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు. ఎప్పుడు కుప్పం వచ్చినా ప్రభుత్వ అతిథి గృహంలోనే బస. ఇదే ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారేది. టైమ్ దొరికితే చంద్రబాబు ఇంటి గురించి విమర్శలు చేసేవారు వైసీపీ నేతలు. ఆ విమర్శల వల్లో ఏమో కుప్పంలో తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో రోడ్డుపక్కన స్థలాన్ని కొనుగోలు చేశారు. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నారు టీడీపీ అధినేత.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు జిల్లాలోని కలికిరి మండలం నగరిపల్లె. నల్లారి సోదరులంతా నగరిపల్లెలోని పూర్వీకుల ఇంట్లోనే ఉండేవారు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే ఇంటికి వచ్చేవారు కిరణ్ కుమార్రెడ్డి. 2014 రాష్ట్ర విభజన సమయంలో సొంతపార్టీ పెట్టి ఘోరంగా ఓడాక రాజకీయాలకు దూరమయ్యారు ఈ మాజీ సీఎం. కాంగ్రెస్ పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యే పనిలో పడ్డారు. అయితే కిర్ణ్కుమార్రెడ్డి సొదరుడు కిశోర్కుమార్రెడ్డి టీడీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి ఆయన టీడీపీ టికెట్పైనే పోటీ చేసి ఓడిపోయారు. పీలేరు టీడీపీ ఇంఛార్జ్ కూడా ఆయనే. స్థానిక రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన కిశోర్ కుమార్రెడ్డి నగరిపల్లెలోని పూర్వీకుల ఇంటిలోనే ఉంటున్నారు. సోదరుడు ఒక పార్టీ.. తానొక పార్టీలో కొనసాగుతూ ఒకే ఇంటిలో ఉంటే ఇబ్బంది అనుకున్నారో ఏమో.. సొంతూరుకు రావడం తగ్గించేశారు మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి. హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పూర్వీకుల ఇంట్లో సోదరుడితో కలిసి ఉండటం కంటే.. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించి కిరణ్ కుమార్రెడ్డి సైతం సొంతూరు నగరిపల్లెలో ఇటీవలే సుమారు 7 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారట. త్వరలో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతారట.
ఇలా ఇద్దరు మాజీ సీఎంలు ఇన్నేళ్లకు సొంత జిల్లాలో సొంత ఇంటి నిర్మాణం ఒకేసారి చేపట్టడం రాజకీయ వర్గాల్లోనూ.. సాధారణ ప్రజానీకంలోనూ చర్చగా మారింది. కాకపోతే వైసీపీ విమర్శల వల్ల చంద్రబాబు.. చంద్రబాబును చూసి కిరణ్ కుమార్రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని పొలిటికల్ సర్కిళ్లలో సెటైర్లు పేలుతున్నాయి.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!