అక్కడ రాజకీయం వేడెక్కిందా..? అత్తా, అల్లుళ్ల మధ్య యుద్ధం రాజుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం?
గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి..!
Also Read
నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్గా సైలెంట్. రాజకీయ యుద్ధ వాతావరణం చల్లబడింది అని అనుకుంటున్న తరుణంలో నర్సింగ్ కాలేజీ భూముల రగడ సెగలు రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య పొలిటికల్ వార్గా మారింది. వరసకు ఇద్దరూ అత్తా అల్లుళ్లు అవుతారు. గద్వాలపై పట్టు నిలుపుకొనే క్రమంలో వీరి మధ్య రాజకీయ విమర్శలు పదునుగానే ఉంటున్నాయి. నర్సింగ్ కాలేజీ భూముల వివాదం ప్రస్తుతం బర్నింగ్ టాపికైంది.
1160 మందికి 80 గజాల చొప్పున పంపిణీ..!
2012లో డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సాంఘీక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దౌదర్పల్లి దర్గా దగ్గర 79 ఎకరాలు సేకరించారు. 2 వేల 4 వందల మంది దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో ఒక పదకొండు వందల 60 మందికి 38 ఎకరాల్లో 80 గజాల చొప్పున పంపిణీ చేశారు. 2013లోనే పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకావడం.. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. ఇళ్ల స్థలాల కేటాయింపు స్కీమ్ను తొలగించిన టీఆర్ఎస్ సర్కార్.. డబుల్ బెడ్రూమ్ల పథకాన్ని తీసుకొచ్చింది.
లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టకపోవడంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం..!
79 ఎకరాల్లో మిగిలిన స్థలంలో దాదాపు 14వందల డబుల్బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన 1160 మంది అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దాంతో ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఆ ల్యాండ్ను నర్సింగ్ కాలేజీతోపాటు 300 పడకల ఆస్పత్రికి కేటాయించింది. అంతే పట్టాలు పొందిన వాళ్లు రోడ్డెక్కారు. వారికి బీజేపీ నేత డీకే అరుణ బాసటగా నిలిచారు. రోజులు గడిచే కొద్దీ సమస్య రాజకీయ రంగు పులుముకుని రసవత్తరంగా మారుతోంది.
నర్సింగ్ కాలేజీ.. ఆస్పత్రి నిర్మాణానికే ఎమ్మెల్యే మొగ్గు..!
బాధితుల తరఫున రోడ్డెక్కుతున్న డీకే అరుణ..!
స్థానికంగానే మెరుగైన వైద్యం అందజేయాలని ఆస్పత్రి కడుతుంటే.. రాజకీయం చేయడం ఏంటన్నది ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రశ్న. పట్టాలు పొందిన లబ్ధిదారులకు మరిన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన వారిదే. అధికారం చేతిలో ఉండటంతో ఆ స్థలం విషయంలో ఎమ్మెల్యే ముందుకెళ్తుంటే.. ఆందోళన చేస్తున్న బాధితుల పక్షాన డీకే అరుణ రోడ్డెక్కుతున్నారు. రాజకీయ లబ్ధి దిశగా ఇద్దరూ అడుగులు వేస్తుండటంతో సమస్య అనేక మలుపులు తిరుగుతోంది. మరి.. ఈ ఆధిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?