BJP : బిల్డప్ ఇద్దామనుకుని బీజేపీ నేత సోము వీర్రాజు బుక్కయ్యారా..? |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ చీఫ్. కోనసీమలో పర్యటనలో భాగంగా అమలాపురం వెళ్దామని అనుకున్నారు. కానీ.. అక్కడ అల్లర్లు జరగడంతో బయట ప్రాంతాల వారిని రానివ్వడం లేదు. సెక్షన్ 30తోపాటు సెక్షన్ 144 అమలులో ఉన్నాయి. దాంతో ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. అయితే బీజేపీకి చెందిన మహిళా నేత తల్లి చనిపోతే పరామర్శకు వెళ్తున్నానన్నది వీర్రాజు చెబుతున్న రీజన్. ఇక్కడే మరో అంశం కూడా ప్రచారంలో ఉంది. అమలాపురానికి చెందిన బీజేపీ నేత బాలయ్య కుమారుడిని అల్లర్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడికి వెళ్లి వీర్రాజు హంగామా చేయబోతున్నారని నిఘా వర్గాలకు సమాచారం వెళ్లిందట. అందుకే ఆయన్ని జొన్నాడ దగ్గర అడ్డుకున్నట్టు చెబుతున్నారు. తన కారును కదలనివ్వకపోవడం.. అడ్డంగా కంటైనర్ లారీని అడ్డుపెట్టడంతో వీర్రాజు శివాలెత్తిపోయారు. జరగకూడనిది ఏదో జరిగిపోయినట్టు.. గతంలో ఎప్పుడూ లేని సంఘటన జరిగినట్టుగా భావించి పెద్ద హైడ్రామా క్రియేట్ చేశారు. విధుల్లో ఉన్న SIతోపాటు కానిస్టేబుల్ను నెట్టేశారు వీర్రాజు. అదే ఇప్పుడు రచ్చ రచ్చగా మారిపోయింది.
సోము వీర్రాజు తీరుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాధ్యతల గల పదవిలో ఉండి సంయమనం కోల్పోతే ఎలా అనేది కొందరి ప్రశ్న. అయితే వీర్రాజు మరో లెక్క వేసినట్టు తెలుస్తోంది. ఖాకీలను రెచ్చగొడితే అది తమకే ప్లస్ అవుతుందని.. అదుపు చేసే సమయంలో ఎక్కడో ఒకచోట పోలీసులు మిస్టేక్ చేస్తారని భావించారట. కానీ.. మొత్తం ఎపిసోడ్ చిరిగి చేట అయ్యింది. ప్లాన్ మొత్తం రివర్స్ అనే టాక్ నడుస్తోంది.
Also Read
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజులపాటు ఏపీలో పర్యటించారు. ఆ టూర్లో పార్టీ నేతలతోపాటు.. అధ్యక్షుడి తీరుపైనా పెదవి విరిచారట. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని పోల్చుతూ.. ఆ విధంగా ఏపీలో డీల్ చేయలేకపోతున్నారని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారట. చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర నేతలు దూకుడుగా వెళ్లకపోతే.. కేంద్ర నాయకత్వం చేసేది ఏదీ ఉండబోదని తేల్చేశారట పెద్దలు. దాంతో కోనసీమ అల్లర్ల అంశాన్ని వీర్రాజు టేకప్ చేశారని అనుమానిస్తున్నారట. అయితే ఆ తర్వాత కానీ వీర్రాజుకు తత్వం బోధ పడలేదట.
పోలీసులతో తాను అలా వ్యవహరించకుండా ఉండాల్సింది.. అయినా తన పోరాటం ప్రభుత్వంపై తప్ప వ్యక్తుల మీద కాదు అని సముదాయించే ప్రయత్నం చేశారట. దానికి పోలీసులు కూడా తమకు వ్యక్తిగత అజెండాలు ఏమీ ఉండవు కదా సార్ అని చెప్పడంతో.. అది కర్టెక్టే కానీ.. ఆ టైమ్లో అలా జరిగిపోయిందని నాలుక కర్చుకున్నారట వీర్రాజు. కానీ.. పోలీసులు ఊరుకోలేదు. విధి నిర్వహణలో ఉన్న SI, కానిస్టేబుళ్లపై దౌర్జన్యం చేసిందుకు వీర్రాజుపై కేసు కట్టేశారు. మొత్తానికి ఆంక్షలు అమలులో ఉన్న కోనసీమలోకి వెళ్లి వచ్చిన తొలి పొలిటీషియన్గా బిల్డప్ ఇద్దామని వీర్రాజు అనుకుంటే.. సీన్ రివర్స్ అయిందనే చర్చ నడుతోంది. క్లారిటీ లేకుండా ఖాకీలతో కయ్యానికి కాలుదువ్వి కామైపోయారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!