BJP : ఢిల్లీ లో ఓకే మరి గల్లీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాబోదనే నినాదంతో కేడర్లో చురుకుపుట్టించే ప్రయత్నం చేస్తున్నారు నాయకులు. పార్టీ అగ్రనేతల రాక కూడా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారు. అయితే పైకి గంభీరంగా ఉన్నా బీజేపీ విస్తరణ.. సంస్థాగతంగా బలోపేతం అయ్యే విషయంలో నేతల మాటలకు.. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పనులకు అస్సలు పొంతన కనిపించడం లేదట. ఇందుకు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై తీసుకుంటున్న శ్రద్ధ ఏ పాటిదో.. అందులోని డొల్లతనం ఎంత ఉందో గ్రహించి కలవర పడుతున్నారట.
తెలంగాణలో 31 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో 19 ఎస్సీ రిజర్వ్డ్, 12 ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఆక్టివిటీని పెంచేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. ఆ కమిటీలతో పార్టీ రాష్ట్ర సారథి బండి సంజయ్ భేటీ అయ్యారు కూడా. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చేయాల్సిన పనులు.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని సూచనలు చేశారట. ఢిల్లీ నాయకత్వం నుంచి కూడా ఇదే విధంగా కొన్ని అంశాలు చెప్పారట. పార్టీ పెద్దలు చెప్పడమైతే ఘనంగానే చెప్పారు కానీ.. క్షేత్రస్థాయిలో వాటి పనే మొదలు కాలేదట. కమిటీలు ఏం చేస్తున్నాయో.. కమిటీ సభ్యుల ప్రాధాన్యం ఏంటో.. ఎక్కడున్నారో అర్థం కావడం లేదట కమలనాథులకు.
Also Read
రాష్ట్రం ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లో 31 రిజర్డ్వ్ సెగ్మెంట్లే కావడంతో.. వీటిల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల పాగా వేయాలన్నది బీజేపీ ఆలోచన. అప్పుడే తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గాలు సుగమం అవుతాయని అనుకుంటున్నారట. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు.. ఫలితాల గణాంకాలు అదే విషయాన్ని చెబుతాయని లెక్కలతో కుస్తీ పడుతున్నారు నేతలు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గాల సమన్వయ కమిటీకి మాజీ ఎంపీ జితేందర్రెడ్డిని.. ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గాల సమన్వయ కమిటీకి మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావును నియమించారు. ఈ రెండు కమిటీలతోనే సంజయ్ భేటీ అయ్యింది.
ఆ మధ్య ఖమ్మం జిల్లాలో ఎస్టీ కమిటీ సమావేశం జరిగింది. తర్వాత ఆ ఊసే లేదు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదట. ఈ సెగ్మెంట్లలో ఇతర సామాజికవర్గాలను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన ప్రొగ్రామ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఈ రెండు కమిటీలలో ఉన్నవారికి పార్టీ మిగతా కార్యక్రమాలు అప్పగించిందట. ఇంకేముందీ.. ఆ పనుల్లో బిజీగా ఉన్నామని తప్పించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఢిల్లీ పెద్దలు చెప్పినా.. రాష్ట్ర నాయకత్వం దిశా నిర్దేశం చేసినా క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు పట్టించుకోకపోవడం చర్చగా మారింది. ఢిల్లీకి.. గల్లీకి మ్యాచ్ కాకపోతే ఎలా అన్నది పార్టీలో కొందరి ప్రశ్న. మరి.. డొల్లగా మారిన పనితీరును కమలనాథులు సమీక్షించుకుంటారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్ను చూసి నేర్చుకో!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
Prabhas – Nbk : ప్రభాస్ ఫౌజీ – బాలయ్య ‘దాదా’లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
-
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
-
Pakistan Match Fixing: పాకిస్థాన్ జట్టులో మరోసారి ఫిక్సింగ్ కలకలం.. ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!