BJP : తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న కమలనాధులు ఆ ఒక్కటి ఎందుకు పక్కనబెట్టారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి వెళ్తున్నా.. కీలక కమిటీ విషయంలో అలికిడి చేయడం లేదు. ఇది రాష్ట్ర బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఈ కమిటీలో చర్చిస్తారు. రాష్ట్రంలో అలాంటి అవకాశం లేకుండా పోయిందనేది కొందరు సీనియర్ల వాదనగా ఉంది.
తెలంగాణకు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 11 మందితో కోర్ కమిటీ ఉండేది. ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగింది కూడా. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర సారథిగా వచ్చాక కోర్ కమిటీ ప్రస్తావన లేదు. కేంద్ర కమిటీ కూడా ఈ దిశగా ఫోకస్ పెట్టిన ఉదంతాలు లేవు. గతంలో కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు.. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో ఢిల్లీ నేతలు వచ్చినప్పుడు కోర్ కమిటీ పేరుతో సమావేశం అవుతున్నా.. అది అధికారిక కమిటీ కాదు. పైగా ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు అధికారికం అవుతాయన్నది కొందరి ప్రశ్న.
Also Read
తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కోర్ కమిటీని ఏర్పాటు చేసే చాలా రోజులైంది. పలు దఫాలుగా సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఆ భేటీ గురించి బయటకు రాగానే తెలంగాణలో ఈ అంశంపై చర్చ మొదలైంది. జాతీయ పార్టీ కీలక కమిటీలు ఖాళీగా ఉండొద్దని పదే పదే చెబుతోంది. కానీ.. కోర్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన జాతీయ నాయకత్వమే దాన్ని పట్టించుకోకపోవడం కాషాయ శిబిరానికి అంతుచిక్కడం లేదట.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నేతల సంఖ్య పెరిగిపోయింది. వారిలో కొందరినే కోర్ కమిటీలో చోటు కల్పించి.. మిగతా వారిని పక్కన పెడితే కొత్త తలనొప్పులు వస్తాయనే అనుమానంతో పెండింగ్లో పెట్టినట్టు అనుమానిస్తున్నారట. రాష్ట్ర పదాధికారుల కంటే ఎక్కువ మంది కోర్ కమిటీలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని అభిప్రాయ పడుతున్నారట. తెలంగాణలో ఉన్నంతగా ఏపీలో సీనియర్లు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరు. అందుకే అక్కడ కమిటీ కూర్పు ఈజీ అయిపోయింది. కానీ.. ఇక్కడ మాత్రం కాషాయ కండువా కప్పుకొన్నవారిలో ఎక్కువ మంది మాజీ మంత్రులు, కేబినెట్ ర్యాంక్ స్థాయిలో పదవులు అనుభవించిన సీనియర్లు ఉన్నారు. అందుకే వెనకాడుతున్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఆ ఒక్కటీ అడక్కు అని ఢిల్లీ నాయకత్వం ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!