Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Bjp Wanted To Rule Telangana Abandon That One

BJP : తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న కమలనాధులు ఆ ఒక్కటి ఎందుకు పక్కనబెట్టారు?

Published Date :June 10, 2022 , 11:14 am
By Premchand Chowdary
BJP : తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న కమలనాధులు ఆ ఒక్కటి ఎందుకు పక్కనబెట్టారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్‌ ఫుల్‌ కోర్‌ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్‌ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్‌ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి వెళ్తున్నా.. కీలక కమిటీ విషయంలో అలికిడి చేయడం లేదు. ఇది రాష్ట్ర బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఈ కమిటీలో చర్చిస్తారు. రాష్ట్రంలో అలాంటి అవకాశం లేకుండా పోయిందనేది కొందరు సీనియర్ల వాదనగా ఉంది.

తెలంగాణకు డాక్టర్‌ లక్ష్మణ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 11 మందితో కోర్‌ కమిటీ ఉండేది. ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగింది కూడా. బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర సారథిగా వచ్చాక కోర్‌ కమిటీ ప్రస్తావన లేదు. కేంద్ర కమిటీ కూడా ఈ దిశగా ఫోకస్‌ పెట్టిన ఉదంతాలు లేవు. గతంలో కోర్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు.. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో ఢిల్లీ నేతలు వచ్చినప్పుడు కోర్‌ కమిటీ పేరుతో సమావేశం అవుతున్నా.. అది అధికారిక కమిటీ కాదు. పైగా ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు అధికారికం అవుతాయన్నది కొందరి ప్రశ్న.

Also Read

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?

తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కోర్‌ కమిటీని ఏర్పాటు చేసే చాలా రోజులైంది. పలు దఫాలుగా సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ రాష్ట్ర బీజేపీ కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఆ భేటీ గురించి బయటకు రాగానే తెలంగాణలో ఈ అంశంపై చర్చ మొదలైంది. జాతీయ పార్టీ కీలక కమిటీలు ఖాళీగా ఉండొద్దని పదే పదే చెబుతోంది. కానీ.. కోర్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన జాతీయ నాయకత్వమే దాన్ని పట్టించుకోకపోవడం కాషాయ శిబిరానికి అంతుచిక్కడం లేదట.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నేతల సంఖ్య పెరిగిపోయింది. వారిలో కొందరినే కోర్‌ కమిటీలో చోటు కల్పించి.. మిగతా వారిని పక్కన పెడితే కొత్త తలనొప్పులు వస్తాయనే అనుమానంతో పెండింగ్‌లో పెట్టినట్టు అనుమానిస్తున్నారట. రాష్ట్ర పదాధికారుల కంటే ఎక్కువ మంది కోర్‌ కమిటీలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని అభిప్రాయ పడుతున్నారట. తెలంగాణలో ఉన్నంతగా ఏపీలో సీనియర్లు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరు. అందుకే అక్కడ కమిటీ కూర్పు ఈజీ అయిపోయింది. కానీ.. ఇక్కడ మాత్రం కాషాయ కండువా కప్పుకొన్నవారిలో ఎక్కువ మంది మాజీ మంత్రులు, కేబినెట్‌ ర్యాంక్‌ స్థాయిలో పదవులు అనుభవించిన సీనియర్లు ఉన్నారు. అందుకే వెనకాడుతున్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఆ ఒక్కటీ అడక్కు అని ఢిల్లీ నాయకత్వం ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • k.lakshman
  • telangana
  • Telangana Politics

తాజావార్తలు

  • Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్‌ ఆన్‌లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?

  • Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?

  • Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు

  • SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..

  • Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions