బీజేపీలో బండారు విజయలక్ష్మి యాక్టివ్ అయ్యారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి పెద్ద పదవిలో ఉంటే.. మామ కూడా రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఆ యువ మహిళా నేత. నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నట్టు కాషాయ శిబిరంలో టాక్. ఇంతకీ ఎవరా మహిళా నేత?
రాజకీయంగా బండారు విజయలక్ష్మి యాక్టివ్ రోల్..!
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతల వారసులు క్రమంగా తెరపైకి వస్తున్నారా? హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆ జాబితాలో ఉన్నారా? దత్తాత్రేయ ఇంటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ వారసులు ఎవరూ లేరు. ఇప్పుడు విజయలక్ష్మి కొన్ని అంశాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఆమెను వారసురాలిగా ప్రమోట్ చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఏటా దసరాకు దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం పెద్ద ఫేమస్. గత ఏడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయినా.. ఈ ఏడాది జలవిహార్లో అలాయ్ బలాయ్కి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ అంతా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మే చూస్తున్నారు. ఆహ్వానాలు మొదలుకొని.. ఏర్పాట్లు మొత్తం విజయలక్ష్మి చెప్పినట్టే జరుగుతున్నాయట.
బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు..!
ఒక్క అలాయ్ బలాయే కాకుండా.. బీజేపీ కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మి పాత్ర పెరుగుతోంది. పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలోనూ సందడి చేశారు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా.. పాదయాత్రలో ఎక్కువ రోజులు పార్టిసిపేట్ చేశారు విజయలక్ష్మి. ఇవన్నీ చూసిన కమలనాథులు.. దత్తాత్రేయ కుమార్తె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు భావిస్తున్నారు.
చేవెళ్ల ఎంపీ టికెట్ అడుగుతారని ప్రచారం..!
అసెంబ్లీకి అయితే జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతారా?
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టికెట్ కోరితే మాత్రం.. విజయలక్ష్మి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ప్రశ్న. గతంలో దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ ఖాళీ లేదు. అక్కడ గెలిచిన కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక విజయలక్ష్మి మామ జనార్దన్రెడ్డి కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకవేళ లోక్సభకు పోటీ చేయాలని విజయలక్ష్మి భావిస్తే.. చేవెళ్లను ఎంపిక చేసుకోవచ్చునని.. దీనికి మామ జనార్దన్రెడ్డి నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాదని పార్టీ నేతలు అనుకుంటున్నారట. కోడలికి బీజేపీ టికెట్ ఇస్తే జనార్దన్రెడ్డి కాదనలేరని ఒక వాదన. కాదూ.. అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటే మాత్రం.. జూబ్లీహిల్స్ టికెట్ అడగొచ్చని టాక్. మరి.. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆలోచన ఏంటో చూడాలి.
తాజావార్తలు
-
IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
-
Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!