ఆ జిల్లాలో టీడీపీని నడిపించడానికి నాయకులు కరువయ్యారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని తెలిసినా.. చీమ కుట్టినట్టు అయినా లేదట ఇక్కడి టీడీపీ నేతలకు.
ఎన్నికలు చేదు ఫలితాలను ఇచ్చినా.. ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న నాయకులు ఒక్కరూ లేరన్నది కేడర్ చెప్పేమాట. వైసీపీని గట్టిగా విమర్శించేవారు కానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కే నేతలు కానీ కనిపించడం లేదు. అధిష్ఠానం నుంచి గట్టి ఒత్తిడి వస్తే .. ప్రెస్నోట్ ఇచ్చి సరిపెట్టేస్తున్నారు నేతలు. మరి గట్టిగా ప్రశ్నిస్తే.. ఒక పదిమందిని పోగేసుకుని మీడియాకు ఫోజులిచ్చి వెంటనే కలుగుల్లోకి వెళ్లిపోతున్నారు.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
ఉమ్మడి జిల్లాలోని కీలక నియోజకవర్గాలకు నాయకులెవరో కూడా కేడర్కు అర్ధంకాని పరిస్థితి ఉందట. విజయనగరంలో టీడీపీ ఇంఛార్జ్గా గత ఎన్నికల్లో పోటీ చేసిన అదితి గజపతిరాజు ఉన్నారు. ఆమె యాక్టివ్గా లేకపోవడం పార్టీ శ్రేణులు డిశ్చార్జ్ అయిపోయాయి. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సొంత కుంపటి పెట్టేసుకున్నారు. నెల్లిమర్లలో నేతల గొడవలు చూశాక.. ఎవరివైపు ఉండాలే కేడర్కు అర్ధం కావడం లేదట. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజు టీడీపీ బలోపేతానికి ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఈ విషయంలో ఆయనకు ఉన్న ఇబ్బందులు ఆయనవి.
విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా యువనేత కిమిడి నాగార్జున కొనసాగుతున్నారు. గతలో పార్టీ .. ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన అనుభవం లేదు. పైగా నియోజకవర్గాల్లోని టీడీపీ ఇంఛార్జులు సీనియర్లు కావడంతో.. వారికి నాగార్జున గట్టిగా చెప్పే పరిస్థితి లేదు. గజపతినగరంలో కేఏ నాయుడు టీడీపీ ఇంఛార్జ్. ఇక్కడ మరో టీడీపీ నేత కరణం శివరామకృష్ణతో ఆయనకు పడదు. బొబ్బిలి, చీపురుపల్లి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుస్థితి ఇలా ఉంటే.. పార్టీ హైకమాండ్ మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుంటోందట. ఇదే వైఖరి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేది ఎలా అన్నది తమ్ముళ ప్రశ్న.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!