బీజేపీ, జనసేన నేతల కామెంట్స్ మిత్రభేదానికి బాటలేస్తున్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్ అనేక సందేహాలకు.. చర్చకు కారణం అవుతున్నాయి. టీడీపీ వన్సైడ్ లవ్వు.. జనసేనను కన్నుగీటడం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటన.. ఇంతలోనే అందరం కలవాలి.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో బంతి బీజేపీ కోర్టులో పడింది. కాషాయ పార్టీ 2014ను రిపీట్ చేస్తుందా? బద్ధ శత్రువుగా భావిస్తున్న టీడీపీతో జత కడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. పైగా మిత్రపక్షంగా ఉంటూ.. తమకు శత్రువైన టీడీపీకి చేరువయ్యేలా జనసేనాని చేస్తున్న ప్రకటనలు బీజేపీ శిబిరంలో అలజడి రేపుతున్నాయి. పొత్తులపై నిర్ణయం అంతిమంగా బీజేపీ జాతీయ నాయకత్వానిదే అయినా.. రాష్ట్రస్థాయిలో స్పందించాల్సిన పరిస్థితి ఏపీ బీజేపీ నేతలపై పడింది. అయితే ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారో లేదో కానీ.. ఈ సమయంలో వారు చేస్తున్న కామెంట్స్ మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆ కోవలోకే వస్తున్నాయి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు
వీర్రాజు చెప్పిన జనంతో పొత్తు అంటే అర్థం ఏంటి? ఏ పార్టీ అయినా జనం మద్దతు ఆశిస్తుంది? ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయి. అయినప్పటికీ జనంతో పొత్తు అని చెబుతూనే.. జనసేనతోనూ పొత్తు అని గొంతు సవరించారు. పైగా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేంటి నష్టమని మీడియా ప్రతినిధులపై చిర్రుబుర్రులాడారు. జనసేన వైఖరిపై ప్రశ్నిస్తే దానికి లౌక్యంగా ఎలా సమాధానం చెప్పాలో వీర్రాజుకు తెలియంది కాదు. కానీ.. ఒక విధమైన అసహనం ఆయనలో కనిపించిందనేది విశ్లేషకుల మాట. ఇదే సమయంలో బీజేపీ, జనసేన పొత్తుపై రకరకాల ప్రశ్నలు.. చర్చలు జోరందుకున్నాయి. జనసేనని బీజేపీ వదులుకుంటుందా? టీడీపీతో వెళ్లిపోవాలని జనసేన నిర్ణయించిందా? 2019లో మాదిరి బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా? అని ఎన్నో మరెన్నో ప్రశ్నలు చర్చల్లో ఉన్నాయి.
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
2014లో బీజేపీతో జనసేనాని ఎందుకు కలిశారో.. 2018లో ఎందుకు దూరం అయ్యారో తెలిసిన చరిత్రే. 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీకి దగ్గరయ్యారు పవన్ కల్యాణ్. ఇద్దరూ మిత్రపక్షంగా ప్రకటించుకున్నారు కానీ.. ఎక్కడా మనసులు, మాటలు కలవలేదు. కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు లేవు. నిరసనలు.. ఆందోళన కార్యక్రమాల్లో ఎవరి దారి వారిదే. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో అవగాహన ఏర్పాటు చేసుకుంది జనసేన. అప్పటి నుంచే మిత్రపక్షాల మధ్య గ్యాప్ వచ్చిందని అనుమానించారు. GHMC ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా వెళ్తానంటే.. చివరి క్షణంలో బీజేపీ పెద్దలు వెళ్లి బుజ్జగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీని సీట్లు అడగకుండా పోటీ నుంచి తప్పుకొంది జనసేన. తిరుపతి లోక్సభ ఉపఎన్నిక సమయంలోనూ ఎవరు పోటీ చేయాలనే దానిపై రెండుపార్టీల శిబిరాల్లోనూ వాడీవేడీ చర్చ జరిగింది. చివరకు బీజేపీ ఒత్తిడితో జనసేన వెనక్కి తగ్గింది. అది జనసైనికులకు రుచించలేదు. బద్వేలు ఉపఎన్నిక సమయంలోనూ రెండు పార్టీలు పోటీపై వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. జనసేన పోటీ చేయడం లేదని చెబితే.. బీజేపీ క్యాండిడేట్ను బరిలో దించింది. ఇలా అనేక ఉదంతాలు మిత్రపక్షాల మధ్య స్నేహానికంటే.. అంతర్గత వైరాన్నే పెంచాయి. గ్రౌండ్ లెవల్లో టీడీపీ కేడర్తో మింగిలైనంత ఈజీగా బీజేపీ శ్రేణులతో కలిసి పనిచేయలేకపోతున్నారట జనసైనికులు.
జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించిన పవన్ కల్యాణ్.. బీజేపీ పెద్దలు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆ దిశగా రెండు పార్టీల మధ్య అడుగులు పడిన ఉదంతాలు లేవు. పైగా కొత్త పొత్తుల దిశగా టీడీపీ, జనసేనలు మాటలతో దగ్గరవుతున్నాయి. జనసేనను వదులుకోవడానికి బీజేపీ ఇష్ట పడకపోయినా.. పరిస్థితులు మాత్రం కమలనాథుల చెయ్యి దాటిపోయినట్టే కనిపిస్తోంది. అందుకే జనసేనను కంటే జనాన్ని నమ్ముకోవాలని అనుకుంటున్నారో ఏమో.. జనంతో పొత్తు అని కొత్త కామెంట్ పాస్ చేశారు వీర్రాజు. ఇక రాం రాం చెప్పుకోవడమే మిగిలిందని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ ఎపిసోడ్కు కమలనాథులు ముగింపు పలుకుతారో.. జనసేన ఎండ్కార్డు వేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!