TDP : ఆ జిల్లాలో టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా.? ఆ నాయకుడిని ఆహ్వానిస్తున్నారా.? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం కాగానే ఎవరిదారి వారు చూసుకున్నారు. టీడీపీ అంటే అభిమానం కలిగిన వారు మాత్రం ఈ మూడేళ్ల కాలంలో తమ శక్తిమేరా పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఆ మధ్య చంద్రబాబు జిల్లాలో పర్యటించడంతో వారిలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల మహానాడు తర్వాత పార్టీ కదలికలు జిల్లాలో పెరిగాయి. అయితే ఇదే సమయంలో సమస్యలు స్వాగతం చెబుతున్నట్టు పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
గతంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి కొంతకాలంగా టీడీపీలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీపై విమర్శలు చేస్తూనే తమ ఉనికిని చాటుకుంటున్నారు కూడా. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇటీవల నారా లోకేష్ను కలిసి పార్టీలో రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబుతో మాట్లాడి స్పష్టత ఇస్తామని లోకేష్ ఆయనకు బదులిచ్చారట. దీంతో కమలాపురం టీడీపీలో కలకలం మొదలైంది. కొద్దినెలల క్రితం మాజీ మంత్రి డీఎల్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. ఆయనకు పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదట. మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్.. పుట్టా సుధాకర్ యాదవ్ అభిప్రాయం మేరకు డీఎల్ను చేర్చుకుంటామని చెప్పారట. అయితే వీరశివారెడ్డికి మాత్రం లైన్ క్లియరైనట్టు ప్రచారం ఊపందుకుంది.
Also Read
తాజాగా కడప పార్లమెంట్స్థాయి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాత నేతల చేరికలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సమన్వయకర్తగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎదుటే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్రెడ్డిని తిరిగి టీడీపీలోకి రప్పించేందుకు అక్కడి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇంఛార్జ్గా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. బీటెక్ రవికి నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలతో పడటం లేదట. వారే సతీష్రెడ్డితో టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథిరెడ్డి, తొండూరు మండల నేతలు తదితరులు సతీష్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం రాంగ్ సిగ్నల్ పంపుతోందని అనుకున్నారో ఏమో.. బీటెక్ రవి సూచనల మేరకే సతీష్రెడ్డి దగ్గరకు వెళ్లామని చెబుతున్నారట. మొత్తానికి కీలక జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న టీడీపీ శ్రేణులు.. కొందరు నాయకులు వద్దు.. కొందరే ముద్దు అని సాగిస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.. ఎవరికి మోదం కలిగిస్తాయో చూడాలి.
- Tags
- ap politics
- Kadapa
- shiva reddy
- tdp
- ycp
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!