YCP : కొందరు మంత్రులు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారా.? అసలు జరిగిందేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ.
ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశించింది. చాలామంది అర్చకులు కోరుకుంటున్నది అదే. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా మంత్రి కొట్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే ప్రధాన ఆలయాల్లో కూడా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మరో కీలక వ్యాఖ్య చేశారు. కొన్ని గుళ్లకు చెందిన ఈనాం భూములు పూజారుల చేతుల్లో ఉన్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడం కూడా అర్చకులతోపాటు బ్రాహ్మణ సామాజికవర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫీడ్ బ్యాక్ ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లిందట.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్లో హైటెన్షన్ ఎందుకు?
ఈ క్రమంలో సీఎం సూచనల మేరకు ప్రభుత్వ పెద్దలు మంత్రి కొట్టు సత్యనారాయణను పిలిపించి.. ఓ చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. సున్నితమైన అంశాల్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటాయన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారట. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాయని.. అందులోనూ మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న అంశాన్ని గమనించాలి కదా అని అక్షింతలు వేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు అన్నికోణాల్లో ఆలోచించాకే.. మీడియా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మరో చర్చా జరుగుతోంది. కొత్తగా వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఇప్పుడిప్పుడే తమశాఖపై పట్టు సాధించే దిశగా పని చేస్తుంటే.. కొంతమంది దేవదాయశాఖ ఉన్నతాధికారులు.. ఆయనకు రాంగ్ ఇన్పుట్స్ ఇస్తూ.. మిస్ లీడ్ చేస్తున్నారట. అధికారులు రాజకీయకోణంలో ఆలోచించకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. మంత్రికి అదే విషయాన్ని బ్రీఫ్ చేస్తుండడంతో.. కొట్టు కూడా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా.. అన్ని రకాలుగా ఆలోచించుకుని మాట్లాడాల్సిన బాధ్యత మంత్రిదే. ఒకమాట ఎక్కువైనా.. తక్కువైనా ఇబ్బందులు తప్పవు. మరి.. సీఎంవో హితోక్తులు అమాత్యుల వారికి వంట బట్టాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!