Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Anantapur Tdp Politics

Anantapur TDP Politics : టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఆజిల్లాలో పార్టీ పరిస్థితి పెళుసుబారిపోయిందా..?

Published Date :July 18, 2022 , 3:58 pm
By Premchand Chowdary
Anantapur TDP Politics : టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఆజిల్లాలో పార్టీ పరిస్థితి పెళుసుబారిపోయిందా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టీడీపీకి గట్టిపట్టున్న ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెలుసు బారిపోయింది. కీలక నేతలే కవ్వించుకుంటున్నారు. అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండానే తన్నుకు చస్తున్నారు నేతలు. అలాంటి జిల్లాలో టీడీపీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు త్రిసభ్య మంత్రం వేసింది అధిష్ఠానం. ఈ ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా? ఇంతకీ ఏంటా జిల్లా?

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన ప్రాంతం. అలాంటి చోట పార్టీకి నాయకులే సమస్యలు తీసుకొస్తున్నారని మూడేళ్లుగా కేడర్‌ గగ్గోలు పెడుతోంది. 2014లో టీడీపీ 12 చోట్ల గెలిచి.. రెండు ఎంపీ సీట్లను కైవశం చేసుకుంది. 2019 నాటికి సీన్‌ రివర్స్‌. 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. టీడీపీ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే గెలిచింది. జిల్లాలో పార్టీకి పట్టులేని ప్రాంతాల్లోనూ వైసీపీ భారీ విక్టరీ కొట్టింది. టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలే దానికి కారణమని పసుపు శిబిరంలో చర్చ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం కొంత వర్కవుట్‌ చేసినా.. అవి ఫలించలేదు. చివరకు ఫలితాలు షాక్‌ ఇచ్చాయి. అయినప్పటికీ టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదు.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

రాష్ట్రంలో ఎన్నికల మూడ్‌ క్రమేపీ బలపడుతుండటంతో టీడీపీ పెద్దలు చికిత్స ప్రారంభించారు. విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితిని సెట్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం ముగ్గురు సీనియర్ నాయకులతో కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, బచ్చుల అర్జునుడు, టీడీ జనార్దన్‌ ఆ కమిటీలో ఉన్నారు. ఈ ముగ్గురు ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చేశారు కూడా. పార్టీ నేతలను పిలిచి సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు. ఇంతకాలం వన్‌సైడ్‌ వెర్షన్‌ వింటూ నిర్ణయాలు తీసుకున్న టీడీపీ అధిష్ఠానం ప్రస్తుతం పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్టు అభిప్రాయ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి వారు చెప్పేది నోట్ చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పటికే శింగనమల సెగ్మెంట్ నేతల అభిప్రాయాలను.. అభ్యంతరాలను తెలుసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషాను పిలిచి మాట్లాడారాట.

ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి సమస్యలు ఉన్నాయి. వీటిల్లో ఆరుచోట్ల అధిష్ఠానం జోక్యం చేసుకున్నా తగ్గేదే లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. కల్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మూడో గ్రూప్‌ మధ్య అస్సలు పడటం లేదు. శింగనమలలో బండారు శ్రావణి, టూమెన్‌ కమిటీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కురుబ బబితల మధ్య అంతర్గత పోరు ఉంది. మడకశికరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య తారాస్థాయిలోనే వర్గపోరు కొనసాగుతోంది. వీరితోపాటు మరో రెండు నియోజకవర్గాల నేతలను కోఆర్డినేషన్‌ కమిటీ పిలిచి మాట్లాడబోతోంది.

త్రిసభ్య కమిటీ.. నియోజకవర్గాల్లోని సమస్యలను ఆలకించడంతోపాటు రెండువైపుల వాదనలను నోట్‌ చేసుకుంటోంది. అన్ని సెగ్మెంట్లలో పరిస్థితిని అంచనా వేశాక.. రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందచేస్తారట. దాంతో త్రిసభ్య కమిటీ ఇచ్చే రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో.. ఏమో? మొత్తానికి మూడేళ్ల తర్వాత చేపట్టిన పెద్ద చికిత్స కావడంతో అందరి దృష్టీ చంద్రబాబు వేసే విరుగుడు మంత్రంపై నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anantapur tdp politics
  • Attar Chand Basha
  • bachula arjunudu
  • T.D. Janardan
  • Yanamala Rama Krishnudu

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions