Gudivada Amarnath : మంత్రి అమర్నాథ్ కు విచిత్రమైన సమస్య..’రెడ్డి’ తెచ్చిన తంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో రాష్ట్ర మంత్రి. కేబినెట్ సహచరులకు ఎవరికీ లేని విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అది కూడా సొంత శాఖ నుంచేనట. చివరకు అధికారులను పిలిచి సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారట మంత్రిగారు. ఇంతకీ అమాత్యులవారి కోపానికి కారణం ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారు?
రాజకీయాల్లో కులం అంతర్భాగంగా మారింది. సామాజిక సమీకరణాల లెక్క తేలకుండా పార్టీలు ముందుకు వెళ్లే పరిస్ధితి లేదు. ఇదంతా ఎన్నికలు.. పార్టీ వ్యవహారాల వరకు బాగానే వర్కవుట్ అవుతాయి. కానీ, అధికారిక కార్యక్రమాలు, ప్రొటోకాల్ దగ్గరకు వచ్చేసరికి “ఫలానా” అనే ప్రస్తావన రావడం ఎవరికైన ఇబ్బందికరంగానే ఉంటుంది. సరిగ్గా అటువంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్కు సొంత శాఖ నుంచే విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. సమస్య చిన్నదిగా కనిపించినా.. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో మార్పు రాకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారట. తన పేరు చివరన ఎటువంటి సందర్భం, అవసరం లేకుండానే “రెడ్డి”అని జోడించి అఫీషియల్గా నోట్స్ రిలీజ్ అవ్వడం మంత్రికి ఇబ్బందిగా మారింది. పేరు చివరన ఆ తోకలు ఎందుకు.. పైగా లేనివి ఎందుకు జోడిస్తున్నారు అని కొందరు సీనియర్ అధికారులను పిలిచి క్లాస్ తీసుకున్నారట.
అమర్నాథ్ పేరు వెనక రెడ్డి జోడించడం వెనక బలమైన కారణాలు లేకపోలేదన్నది కొందరు చెప్పేమాట. మంత్రికాక ముందు అమర్నాథ్ వైసీపీ అధికార ప్రతినిధి. తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. ఆ సందర్భంలోనే అమర్నాథ్ పేరు చివరన రెడ్డి అని తగిలించేయడం.. ఆయన స్వయంగా ఫోన్ చేసి వాటిని తీసేయాలని కోరిన ఉదంతాలు ఉన్నాయి. అప్పట్లో ఇదంతా ప్రైవేట్ వ్యవహారం కావడంతో సీరియస్గా తీసుకునేవారు కాదు అమర్నాథ్. కానీ.. ఇప్పుడు మంత్రి. అధికారిక కార్యక్రమాల్లోనూ తనను అమర్నాథరెడ్డిగా సంభోదించడం ఆయనకు మింగుడు పడటం లేదట.
ఈ నెల 16న అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పిన ATG టైర్ల కంపెనీని అమర్నాథ్ ప్రారంభించబోతున్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో ఏర్పాట్లు అన్నీ తానై చూస్తున్నారట. ఈ క్రమంలోనే అతిథుల ఆహ్వానాలపై చర్చ జరిగినప్పుడు.. తన పేరు చివరన రెడ్డి చేర్చవద్దని.. మంత్రి కోరారట. తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈవో, జపాన్ ప్రతినిధులు తనను అమర్నాథ్రెడ్డిగా సంభోదించడాన్ని గుర్తు చేశారట. అందుకే టైర్ల కంపెనీ కార్యక్రమంలో అలాంటి తప్పు జరగకుండా చూడాలని అధికారులను కోరారట మంత్రి. మరి.. పేరు చివరన ఈ తోక తెచ్చిన తంటా నుంచి అమర్నాథ్ బయట పడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?