కేంద్రమంత్రి కిషన్రెడ్డితో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ?
ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం!
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్గా ప్రమోషన్ పొందిన కిషన్రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది రాజకీయ వర్గాల మాట. అందుకే.. కిషన్రెడ్డితో రంజిత్రెడ్డి ములాఖత్ టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఇటీవల టీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు రంజిత్రెడ్డి సన్నిహితుడు కావడం కూడా ఇక్కడ కీలక పాయింట్. ఆయన ఈటలకు సన్నిహితుడే కాదు.. మిత్రుడు.. వ్యాపార భాగస్వామి కూడా. ఈటల ఎపిసోడ్లో ఇంత వరకు రజింత్రెడ్డి ఓపెన్గా మాట్లాడింది లేదు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
కాలుజారిపడినా.. అందరినీ కలుస్తున్నారు?
ఆ మధ్య ఎంపీ రంజిత్రెడ్డి మార్నింగ్ వాక్కు వెళ్తూ కాలుజారి పడ్డారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో రెండు మూడు నెలలు బెడ్రెస్ట్లో ఉంటానని కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఎంపీ చెప్పారట. అయితే ఆయన అమెరికా వెళ్లి వచ్చారు. పలు శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి వచ్చారు రంజిత్రెడ్డి. కానీ.. మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో రంజిత్రెడ్డి భేటీ కావడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది.
మర్యాదపూర్వక భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటి?
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మర్యాద పూర్వకంగానే ఎంపీ రంజిత్రెడ్డి కలిశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పనులపై మాట్లాడారట. కేంద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు.. ఇతర అంశాలపై చర్చించారట. ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కిషన్రెడ్డిని కోరారట. బయటకు ఇలాంటి విషయాలు ఎన్ని చెబుతున్నా.. లోగుట్టు ఇంకేదో ఉందని చెవులు కొరుక్కోవడం మాత్రం ఆగడం లేదు. మరి.. ఈ భేటీ ఇంకెన్ని ఊహాగానాలకు దారితీస్తుందో చూడాలి.
పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ?
ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం!
ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్గా ప్రమోషన్ పొందిన కిషన్రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది రాజకీయ వర్గాల మాట. అందుకే.. కిషన్రెడ్డితో రంజిత్రెడ్డి ములాఖత్ టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఇటీవల టీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు రంజిత్రెడ్డి సన్నిహితుడు కావడం కూడా ఇక్కడ కీలక పాయింట్. ఆయన ఈటలకు సన్నిహితుడే కాదు.. మిత్రుడు.. వ్యాపార భాగస్వామి కూడా. ఈటల ఎపిసోడ్లో ఇంత వరకు రజింత్రెడ్డి ఓపెన్గా మాట్లాడింది లేదు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
కాలుజారిపడినా.. అందరినీ కలుస్తున్నారు?
ఆ మధ్య ఎంపీ రంజిత్రెడ్డి మార్నింగ్ వాక్కు వెళ్తూ కాలుజారి పడ్డారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో రెండు మూడు నెలలు బెడ్రెస్ట్లో ఉంటానని కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఎంపీ చెప్పారట. అయితే ఆయన అమెరికా వెళ్లి వచ్చారు. పలు శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి వచ్చారు రంజిత్రెడ్డి. కానీ.. మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో రంజిత్రెడ్డి భేటీ కావడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది.
మర్యాదపూర్వక భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటి?
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మర్యాద పూర్వకంగానే ఎంపీ రంజిత్రెడ్డి కలిశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పనులపై మాట్లాడారట. కేంద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు.. ఇతర అంశాలపై చర్చించారట. ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కిషన్రెడ్డిని కోరారట. బయటకు ఇలాంటి విషయాలు ఎన్ని చెబుతున్నా.. లోగుట్టు ఇంకేదో ఉందని చెవులు కొరుక్కోవడం మాత్రం ఆగడం లేదు. మరి.. ఈ భేటీ ఇంకెన్ని ఊహాగానాలకు దారితీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!