Tollywood: నిర్మాతల జట్టు ‘ఓటీటీ’ల చేతుల్లోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నిజానికి కరోనా ముందు వరకు ఓటీటీ సంస్థల ప్రాబల్యం అంతగా తెలుగు సినీ పరిశ్రమ మీద ఉండేది కాదు. ఎప్పుడైతే కరోనా కారణంగా జనం అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు అప్పుడు ఓటీటీకి విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. దీంతో ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కూడా కాకముందే కాంబినేషన్స్ చూసి అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతేకాదు, కరోనా టైంలో ఆయా సంస్థలకు విపరీతమైన రాబడి రావడంతో ఆ వచ్చిన డబ్బుని మళ్లీ సినిమాల మీదే ఇన్వెస్ట్ చేసేందుకు సినిమాకి ఎంత అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా కోట్లకు కోట్లు కాంబినేషన్ల మీద నమ్మకాలతో పెట్టుబడులు పెట్టారు.
Also Read:Prem Kumar : యూటర్న్ తీసుకుంటోన్న సాఫ్ట్ దర్శకుడు
Also Read
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
- Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
- Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
- Vijay: పాపం విజయ్... రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
తర్వాత కాలంలో ఆ భారీగా పెట్టుబడి పెట్టిన సినిమాలన్నీ చాలావరకు బోల్తా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థలు ఇప్పుడు పెట్టుబడి పెట్టడం కాదు కదా, నిర్మాతలతో గీచి గీచి బేరాలాడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు నిర్మాతలు కూడా ఓటీటీ సంస్థల నుంచి వచ్చే ఆదాయాల మీద పెద్దగా ఫోకస్ చేసే వాళ్ళు కాదు. ముందుగా థియేట్రికల్ నుంచి ఎంత రాబట్టుకోవాలా అని ప్రయత్నం చేసేవారు. తర్వాత శాటిలైట్, ఆడియో లాంటి ఆప్షన్స్ చూసుకునేవాళ్లు. ఇప్పుడు థియేటర్ల రాబడితో సమానంగా ఓటీటీ రాబడి ఉంటుంది. ఒకప్పుడు సినిమాలు మొదలుపెట్టినప్పుడు కాంబినేషన్లు చూసి అడ్వాన్స్ ఇచ్చిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఆయా సినిమాల రిలీజ్ డేట్లను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది.
Also Read:Nara Lokesh meets Amit Shah: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ
ఏకంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, నాగార్జున కుబేర లాంటి సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలు కంట్రోల్ చేస్తున్నాయి అంటే, ఇప్పుడు నిర్మాతల జుట్టు సంస్థల చేతిలోకి ఎంత వరకు వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో మేల్కొని ఓటీటీ సంస్థలతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది నిర్మాతలు మాత్రం ఓటీటీ సంస్థలు కూడా పెట్టుబడి పెడుతున్నాయి కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తే తప్పేంటి అని వారితో అంటకాగడానికే సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఓటీటీ సంస్థల ప్రాబల్యం మాత్రం తెలుగు సినీ పరిశ్రమ మీద విపరీతంగా కనిపిస్తుంది. ఇది పెరిగితే థియేటర్ల వ్యవస్థకు కచ్చితంగా ఏ రోజైనా ఇబ్బందే అని చెప్పక తప్పదు. హిందీలో ఇప్పుడు ఎలా అయితే ఎనిమిది వారాల థియేటర్ రన్ విండో ఉందో, తెలుగులో కూడా అలాంటిది ఫాలో అవ్వకపోతే భవిష్యత్తులో సినీ థియేటర్ల వ్యవస్థకు ముప్పు తప్పదు. ఈ విషయంలో సినీ పెద్దలతో పాటు థియేటర్ యాజమాన్యాలు కూడా మేల్కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!