NRI Arrest: భార్యపై వేధింపులు.. అమెరికాలో తిరుపతికి చెందిన ఎన్నారై అరెస్టు
- కాలిఫోర్నియాలో గృహహింస కేసులో తిరుపతి ఎన్నారై అరెస్ట్
- భార్యపై వేధింపులు, కోర్టు ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలు
- సాంటా క్లారా జైలులో రిమాండ్ తరువాత బెయిల్పై విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NRI Arrest: గృహహింస కేసులో కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (MPD) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో కలిసి దర్యాప్తు నిర్వహించి జెస్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై గృహహింసకు పాల్పడటంతో పాటు, కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వు ను ఉల్లంఘించినట్లుగా జెస్వంత్పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నివేదికల ప్రకారం, దర్యాప్తు అనంతరం జెస్వంత్పై కాలిఫోర్నియా పీనల్ కోడ్ సెక్షన్లు 273.5(a) జీవిత భాగస్వామిపై శారీరక గాయపరచడం, 273.6(a) కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.
సాంటా క్లారా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి పోలీసు నివేదికలు, ప్రమాణపూర్వక పత్రాలను పరిశీలించిన తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అరెస్టు అనంతరం జెస్వంత్ను మొదట సాంటా క్లారా కౌంటీ మెయిన్ జైలుకు, ఆ తర్వాత ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. అనంతరం జెస్వంత్కు బెయిల్ మంజూరు కాగా, ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించిన ప్రారంభ విచారణ త్వరలో జరగనుంది.
Also Read
- America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
- ATA Vedukalu 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 'ఆటా వేడుకలు'.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- Kodela Sivaram : టాంపాలో కొడెల శివరామ్తో తెలుగు వారి ఆత్మీయ సమావేశం విజయవంతం
- Ram Charan: డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు
ఈ కేసు వలస భారతీయ సమాజంలో గృహహింస అంశంపై మరోసారి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, విదేశాల్లో ఒంటరిగా ఉంటూ హింసను ఎదుర్కొంటున్న మహిళల భద్రత, న్యాయ సహాయం వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఈ ఘటన తేటతెల్లం చేసిందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న NGO ప్రతినిధి తరుణి ఈ సందర్భంగా స్పందిస్తూ.. “బాధితుల భద్రత, గౌరవం, న్యాయ హక్కులు అత్యంత ప్రాధాన్యమైనవి. గృహ హింస వంటి కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందించడం సమాజానికి న్యాయం అందించే మార్గంలో కీలకమైన అడుగు. హింసను ఎదుర్కొంటున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను వెంటనే సంప్రదించాలి” అని సూచించారు. వలసదారుల సమాజాల్లో గృహహింస బాధితులకు రక్షణ, చట్టపరమైన సహాయం అందించే వ్యవస్థలను పటిష్టం చేయాలని తరుణి అభిప్రాయపడ్డారు.
AP Weather Alert: 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండండని హోంమంత్రి సూచన!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!