Mizoram New CM: మిజోరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన లాల్దుహోమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరం రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్దుహోమా ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి జొరాంథంగా కూడా వెళ్లారు. ఎంఎన్ఎఫ్ శాసనసభా పక్ష నేత లాల్చందమా రాల్టేతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మరో మాజీ సీఎం లాల్ థన్హావ్లా కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జెడ్పీఎం పార్టీ నాయకుడిగా లాల్దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను పార్టీ నేతలు మంగళవారం ఎన్నుకున్నారు.
Read Also: Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇక, 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన జెడ్పీఎం పార్టీ 2018 ఎన్నికలలో 8 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్యను 27కు పెంచుకుని మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరంలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కావాలి.. 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి కేవలం 10 సీట్లలో విజయం సాధించింది. తద్వారా అధికార ఎంఎన్ఎఫ్ ఐదేళ్ల పాలనకు ముగిసింది.
Read Also: Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..
అయితే, 8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరం రాష్ట్రంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓటు హక్కును 80 శాతం మంది వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. జెడ్పీఎం, ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. కానీ, ఒక్కసీటు కూడా గెలవలేదు.. కాగా, మిజోరంలో ఈసారి రికార్డు స్థాయిలో 77 శాతం పోలింగ్ పోల్ అయింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!