Mizoram New CM: మిజోరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన లాల్దుహోమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరం రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్దుహోమా ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి జొరాంథంగా కూడా వెళ్లారు. ఎంఎన్ఎఫ్ శాసనసభా పక్ష నేత లాల్చందమా రాల్టేతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మరో మాజీ సీఎం లాల్ థన్హావ్లా కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జెడ్పీఎం పార్టీ నాయకుడిగా లాల్దుహోమాను, ఉపాధ్యక్షుడిగా కె.సప్దంగను పార్టీ నేతలు మంగళవారం ఎన్నుకున్నారు.
Read Also: Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇక, 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన జెడ్పీఎం పార్టీ 2018 ఎన్నికలలో 8 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్యను 27కు పెంచుకుని మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిజోరంలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కావాలి.. 2018 ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఈసారి కేవలం 10 సీట్లలో విజయం సాధించింది. తద్వారా అధికార ఎంఎన్ఎఫ్ ఐదేళ్ల పాలనకు ముగిసింది.
Read Also: Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..
అయితే, 8.57 లక్షల మంది ఓటర్లున్న మిజోరం రాష్ట్రంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఇందులో ఓటు హక్కును 80 శాతం మంది వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో పాటు మొత్తం 174 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. జెడ్పీఎం, ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 23 స్థానాల్లో మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపింది. కానీ, ఒక్కసీటు కూడా గెలవలేదు.. కాగా, మిజోరంలో ఈసారి రికార్డు స్థాయిలో 77 శాతం పోలింగ్ పోల్ అయింది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!