Zomato : ఢిల్లీలో ఖరీదైన భూములు కొన్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ రెండు డీల్లు 2023 సంవత్సరంలో పూర్తయ్యాయి. దీని కోసం మొత్తం రూ.79 కోట్లు చెల్లించారు. జొమాటో సీఈఓ కూడా ఈ ల్యాండ్ డీల్ కోసం స్టాంప్ డ్యూటీ కింద మొత్తం రూ.5.24 కోట్లు చెల్లించారు.
Read Also:Pakistan: పాక్ లో న్యాయస్థానాల కంటే ఆర్మీపైనే ఎక్కువ నమ్మకం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
డీల్ ఎప్పుడు జరిగింది?
దీపిందర్ గోయల్ మార్చి 28, 2023న భూమి ఒప్పందాన్ని చేశారు. అతను లక్సలోన్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ డీల్ మొత్తం రూ.29 కోట్లకు జరగగా, ఇందుకు రూ.1.74 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. రెండవ ల్యాండ్ డీల్ 1 సెప్టెంబర్ 2023 న పూర్తయింది. ఇందులో Zomato CEO 2.53 ఎకరాల భూమిని రవి కపూర్ అనే వ్యక్తి నుండి 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ రెండు భూములు ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి గ్రామంలో ఉన్నాయి. రూ.50 కోట్ల విలువైన రెండో భూమికి రూ.3.50 కోట్లు స్టాంపు డ్యూటీగా ఇచ్చారు. అయితే, ఈ రెండు ల్యాండ్ డీల్స్పై జోమాటో అధికారిక సమాచారం ఇవ్వలేదు.
Read Also:MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..
గత కొన్ని నెలలుగా దేశంలోని అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులు, వ్యాపారవేత్తలు రాజధాని ఢిల్లీ, NCR ప్రాంతంలో అనేక ఖరీదైన ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ ప్రాంతంలో రూ.99.34 కోట్ల విలువైన వాణిజ్య ప్రాపర్టీని కొనుగోలు చేశారు. లెన్స్కార్ట్ యజమాని పీయూష్ బన్సాల్ ఢిల్లీలోని పాష్ ఏరియాలలో ఒకటైన నీతి బాగ్ ప్రాంతంలో 18 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో రూ.32.60 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!