MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మార్కాపురం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్మన్గా డాక్టర్ షంషేర్ అలీబేగ్, వైస్ ఛైర్మన్గా మురళీ, డైరెక్టర్లుగా పిన్నిక లక్ష్మీప్రసాద్ యాదవ్, డాక్టర్ మక్బుల్ బాషా, ఇల్లూరి శారద, తూంపాటి ఆంజనేయులు, పేరూరి లక్ష్మీదేవి, షేక్ నూర్జహాన్, ఓర్సు పత్తెమ్మ, వేశపోగు రాజు, కోల వసంతకుమారి, శ్రీరామ్ అక్కమ్మ, చక్క సత్యనారాయణ, ఊటుకూరి సురేష్, కర్నా రమాదేవీలతో యార్డు సెక్రటరీ కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గిట్టుబాటు ధర కల్పించారని పేర్కొన్నారు. నూతన పాలక మండలి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
Read Also: Tehsildar Ramanaiah Case: తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
మార్కెట్ యార్డు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ షంషేర్ అలీబేగ్ అన్నారు. ఎమ్మెల్యే కేపి నాగార్జున రెడ్డి సహకారంతో మోడల్ ఏఎంసీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్ యార్డులో రూ.78 లక్ష లతో నూతన ఏఎంసీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కేపీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ మేడా బద్రీనాథ్, ఎస్ఆర్సీ లేబ రేటరీస్ ఎండీ డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ఎంపీపీ అరుణా చెంచిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ రమాదేవి, పార్టీ ప్రధాన కార్యదర్శులు బి.శేషయ్య, పత్తి రవిచంద్ర, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నూతన ఛైర్మన్ షంషేర్ అలీబేగ్ ఘనంగా సన్మానించారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!