Zomato : ఢిల్లీలో ఖరీదైన భూములు కొన్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ రెండు డీల్లు 2023 సంవత్సరంలో పూర్తయ్యాయి. దీని కోసం మొత్తం రూ.79 కోట్లు చెల్లించారు. జొమాటో సీఈఓ కూడా ఈ ల్యాండ్ డీల్ కోసం స్టాంప్ డ్యూటీ కింద మొత్తం రూ.5.24 కోట్లు చెల్లించారు.
Read Also:Pakistan: పాక్ లో న్యాయస్థానాల కంటే ఆర్మీపైనే ఎక్కువ నమ్మకం..
Also Read
డీల్ ఎప్పుడు జరిగింది?
దీపిందర్ గోయల్ మార్చి 28, 2023న భూమి ఒప్పందాన్ని చేశారు. అతను లక్సలోన్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ డీల్ మొత్తం రూ.29 కోట్లకు జరగగా, ఇందుకు రూ.1.74 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. రెండవ ల్యాండ్ డీల్ 1 సెప్టెంబర్ 2023 న పూర్తయింది. ఇందులో Zomato CEO 2.53 ఎకరాల భూమిని రవి కపూర్ అనే వ్యక్తి నుండి 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ రెండు భూములు ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలోని డేరా మండి గ్రామంలో ఉన్నాయి. రూ.50 కోట్ల విలువైన రెండో భూమికి రూ.3.50 కోట్లు స్టాంపు డ్యూటీగా ఇచ్చారు. అయితే, ఈ రెండు ల్యాండ్ డీల్స్పై జోమాటో అధికారిక సమాచారం ఇవ్వలేదు.
Read Also:MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..
గత కొన్ని నెలలుగా దేశంలోని అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులు, వ్యాపారవేత్తలు రాజధాని ఢిల్లీ, NCR ప్రాంతంలో అనేక ఖరీదైన ఆస్తి ఒప్పందాలు చేసుకున్నారు. ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ ప్రాంతంలో రూ.99.34 కోట్ల విలువైన వాణిజ్య ప్రాపర్టీని కొనుగోలు చేశారు. లెన్స్కార్ట్ యజమాని పీయూష్ బన్సాల్ ఢిల్లీలోని పాష్ ఏరియాలలో ఒకటైన నీతి బాగ్ ప్రాంతంలో 18 కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మేక్మైట్రిప్ గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్లో రూ.32.60 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!