మాపై దాడి చేయడం తాలిబన్ల చర్యలాంటిది: వైఎస్ షర్మిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు.
వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు. మమ్మల్ని బలవంతంగా కర్లలోకి ఎక్కించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా దీక్ష చేసే హక్కు మాకు లేదా..? దీక్ష చేస్తున్న మాపై దాడి చేయడం తాలిబన్ల చర్యలాంటిందని’ షర్మిల ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
‘రాష్ట్రం తాలిబన్లలా కేసీఆర్ చేతిలో బందీ అయ్యింది. చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడు. జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోరు అన్న ధైర్యమే దాడులకు కారణం అవుతుంది. ఈరోజు యువత ఆశయం లేకుండా బ్రతుకుతుంది. డ్రగ్స్, గాంజా, మద్యం ఎక్కువగా దొరుకుతుంది. ఈ మత్తు పదార్ధాలవల్లే యువత పాడై పోతుందని’ షర్మిల తెలిపారు.
‘300 బడులు తీసేశారు, 14,000 మంది టీచర్లను తొలగించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 300 శాతం మహిళల పైన దాడులు విపరీతంగా పెరిగాయి. ఏమి స్పందించలేరన్న ఆలోచనతోనే చిన్నారులపై అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇది బంగారు తెలంగాణ నా, బరబాద్ అవుతున్న తెలంగాణ నా..? వీటన్నిటికీ కారణం కేసీఆర్ నే..’ అని షర్మిల ఆరోపణలు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి 10 లక్షల రివార్డు ప్రకటించడం కేసీఆర్, పోలీసుల వైఫల్యమేనని ఆమె పేర్కొన్నారు. వాళ్ళు తాగుబోతులు గనక, రాష్ట్రాన్ని కూడా తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్నారని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!