YSRCP: 6న కావలిలో వైసీపీ భారీ సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు ఓ వైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర, బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. ఐదో సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలో సిద్ధం భారీ బహిరంగ సభ జరగనుంది.. ఇక, ఈ రోజు నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మేమంతా సిద్ధం పోస్టర్ ను విడుదల చేశారు వైసీపీ నేతలు.. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి.. జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. 5న సభలపై నేతలతో సమీక్షా సమావేశాలు ఉంటాయని తెలిపారు. ఇక, నెల్లూరులో 6న సీఎం జగన్ ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది నేతలతో సమావేశమవుతారని వెల్లడించారు. కావలి సమీపంలోని వెంగయ్య గారి పాలెంలో 6వ తేదీన సిద్ధం సభ జరుగుతుంది.. ఈ సిద్ధం సభలకు స్పందన అనూహ్యంగా ఉంది.. కావలి సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని తెలిపారు విజయసాయిరెడ్డి.
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ఇక, నాలుగు సిద్ధం సభలు విజయవంతమయ్యాయి.. కావలిలో జరిగే ఐదో సిద్ధం సభ కోసం కూడా ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం. టీడీపీకి నామ మాత్రపు సీట్లు మాత్రమే వస్తాయన్నారు. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు మేమంతా సిద్ధం కార్యక్రమం ఉంటుంది.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు వద్ద జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందన్నారు. 5న యాత్రకు విరామం ఉంటుంది.. 6న కావలిలో బహిరంగ సభ జరుగుతుందని.. అనంతరం కందుకూరు నియోజకవర్గంలో యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రశేఖర్ రెడ్డి.
తాజావార్తలు
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!