Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ysrcp Mp Vijayasai Reddy Raises Ap Problems In All Party Meeting In Delhi

MP Vijayasai Reddy: విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

NTV Telugu Twitter
Published Date :July 19, 2023 , 8:45 pm
By Sudhakar Ravula
MP Vijayasai Reddy: విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

MP Vijayasai Reddy: విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్‌ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. గురువారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేవనెత్తిన అంశాలను వివరించారు సాయిరెడ్డి..

బీసీలకు సంబంధించి వైసీపీ మొదట్నుంచీ చాలా స్పష్టమైన విధివిధానాలతో ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ రకంగానైతే చట్టసభల్లో రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారో.. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌ను అమలులో ఉంది. అదే మాదిరిగా దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని వైసీపీ తరఫున సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.. ఇక, పార్టీ ఫిరాయింపుల చట్టం విషయానికొస్తే రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో దీనిని పొందుపరిచినప్పటికీ అది పూర్తిగా నిర్వీర్యం అయింది. అటు కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇటు బీజేపీ ప్రభుత్వం రెండూ కూడా ఆ చట్టం అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకొచ్చాం. రాష్ట్రాల్లో, లోక్‌సభలో ప్రిసైడింగ్‌ అధికారులుగా ఉన్న స్పీకర్లు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు.

మరోవైపు.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా మేం చర్చలో పెట్టామన్నారు సాయిరెడ్డి.. ప్రత్యేక హోదా అనేది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తామన్నారు. మరి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వెళ్లిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా ఈరోజు వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అవసరమని… అది ఆంధ్రుల హక్కుగా దీన్ని మేం అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆ హోదాను కల్పించమని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరులో సానుకూలంగానే వ్యవహరిస్తోంది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్‌–1లో రూ.12911 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన నిధులు రూ.4,233 కోట్లు కూడా త్వరలోనే విడుదల చేయాలని కేంద్రానికి మేం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.1310 కోట్లు ఖర్చుపెట్టగా, ఆ బకాయిల మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు విజయసాయి రెడ్డి.

సౌత్‌ కోస్టల్‌ రైల్వేజోన్‌ విషయంలో.. ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్‌ 13, 8వ పాయింట్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి నాలుగేళ్ళు అయింది. రైల్వే జోన్‌ ఏర్పాటుపై డీపీఆర్‌ సమర్పించి మూడేళ్లైంది కానీ, సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు.. దీనిపై కాలయాపన తగదని అఖిలపక్ష సమావేశంలో చెప్పి రైల్వే జోన్‌ ప్రారంభాన్ని త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.. ఇక, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ అభిప్రాయాన్ని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి స్పష్టంచేశాం. ఈరోజు అఖిలపక్ష సమావేశం వేదికగా మరోమారు దీనిని ప్రస్తావించాం. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలనే కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎట్టిపరిస్థితులలోను ఆమోదయోగ్యం కాదని.. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అఖిలపక్షంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. నష్టాల్లోఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించాలనేది బీజేపీ ప్రభుత్వ విధానం. అయితే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో ఉన్న సంస్థ. లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయాలనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయం చాలా తప్పు అనే విషయాన్ని మేం పదేపదే చెప్పాం. ఈరోజు అఖిలపక్షం సమావేశం ద్వారా కేంద్రానికి మరోమారు అదే విషయం స్పష్టం చేశామని.. ఈ అంశాలన్నింటినీ ఈ పార్లమెంట్‌ సమావేశాలలో లేవనెత్తి ఏపీ ప్రజల తరఫున వైసీపీ ఎంపీలంతా పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు విజయసాయి రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • All Party Meeting
  • Andhra Pradesh
  • Ap Problems
  • Delhi
  • mp vijayasai reddy

తాజావార్తలు

  • Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..

  • CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!

  • Astrology: జూన్‌ 7, శనివారం దినఫలాలు

  • Naslen : మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

  • Mexico Plane Crash: మెక్సికోలో కూలిన విమానం.. ముగ్గురు మృతి

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions