Margani Bharat: మహానాడు పేరుతో రాజమండ్రిని నాశనం చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టీడీపీ నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు. రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. వెన్నుపోట్లు పొడవడం ఎందుకు?.. శత జయంతి ఉత్సవాలు చేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న నాయకుడు చంద్రబాబు కాదా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు. రాజమండ్రిని నాశనం చేశారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారు. దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు. ఎంతకు తెగిస్తే ఇవన్నీ చేస్తారు అంటూ భరత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Minister Srinivas Goud: లిఫ్ట్లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
విశాలమైన గ్రౌండ్లో పబ్లిసిటీ కోసం హడావిడి చేయకండి.. పుష్కరాల్లో ఘటన జరిగితే దానికి టీడీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం విగ్రహం కోటిపల్లి బస్టాండ్లో ఠీవీగా కనపడేదని… ఆయన విగ్రహం తొలగించి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టారన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతల మనస్తత్వాన్ని గమనించొచ్చన్నారు. గత పుష్కరాల్లో కూడా పుష్కరఘాట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టి దేవుణ్ని అవమానించారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నా, పార్టీని, అధికారాన్ని ఎన్టీఆర్ వద్ద నుంచి లాక్కుని ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహించటం దారుణమని.. ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందన్నారు. మహానాడు సవ్యంగా నిర్వహించుకోండి… అవసరమైతే తాగునీళ్ల ట్యాంకులు కూడా తాము పంపిస్తామని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!