Gannavaram Politics: గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి.. మరోసారి గన్నవరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగి.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. వల్లభనేని వంశీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత.. వైసీపీలో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డగా మారిపోయింది పరిస్థితి.. ఈ రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది.. వైసీపీ అధిష్టానానికి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు సముదాయించినా.. ఇది కొలిక్కిరాకుండా పోయింది..
చివరకు వైసీపీకి గుడ్బై చెప్పేసి.. టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు యార్లగడ్డ.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. ఈ నెల 19వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణ జిల్లాకి చేరుకోనుండగా.. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ప్రస్తుతం మాత్రం గన్నవరంలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. గన్నవరంలో కార్యకర్తలతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.. రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కార్యకర్తల సమావేశం తర్వాత కీలక నిర్ణయం యార్లగడ్డ తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు.. అది రాకపోతే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తారని క్యాడర్ చెబుతున్నమాట..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
మరోవైపు.. యార్లగడ్డ టీడీపీలోకి వెళ్తారని చానళ్ళుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ వస్తోంది.. వైసీపీలో ఉండాలా, పార్టీ మారాలా అనే అంశంపై కార్యకర్తల భేటీలో యార్లగడ్డ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.. అయితే, నేను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటా.. ఇక్కడి నుంచే పోటీ చేస్తా.. ఏ పార్టీ అన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటూ ఓ సందర్భంలో యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ సారి వల్లభనేని వంశీకే వైసీపీ టికెట్ దక్కే అవకాశం ఉండడంతో.. మరోసారి తన అదృష్ట్యాన్ని గన్నవరం నుంచే పరీక్షించుకోవాలన్న పట్టుదలతో ఉన్న యార్లగడ్డ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి మరోసారి బరిలోకి దిగే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!