YSR Bima: వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం.. వారికి రూ.5లక్షల సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Bima Scheme: ఆంధ్రప్రదేశ్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందిస్తారు. అలాగే 18- 70 సంవత్సరాలోపు వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత వైలక్యం పొందినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తారు.
గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ బీమా పథకాన్ని 2021 జులై 1న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఆర్ధిక సంవత్సరంలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాల్లో రూ.1307 కోట్లు ఖర్చు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బీమా పేరుతో అమలు చేస్తోంది. ఈ పథకానికి ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి నమోదు ప్రక్రియను చేపట్టి లబ్ధిదారులను గుర్తిస్తారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Read Also: GVL Narasimha Rao: పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరిహారం చెల్లింపును ఏపీ సర్కారు చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..