YS Sharmila: ఏంది షర్మిలక్క.. రాజీవ్ గాంధీని అట్లా ఎట్లా కలిశావ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియా శకం నడుస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా ఏదైనా పొరపాటున నోరుజారితే అంతే సంగతలు.. నెట్టింట నానా రచ్చ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. అయితే, తాజాగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ కు గురౌవుతుంది. ఇందుకు కారణంగా ఏంటంటే.. రాజీవ్ గాంధీని కలిశానని వైఎస్ షర్మిల నోరు జారడమే.. వివరాల్లోకి వెళితే.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల ఇవాళ (గురువారం) ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. 10 జనపథ్లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన షర్మిల దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ మీటింగ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
Read Also: Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే, ఈ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని కలవటం జరిగింది.. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖరరెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంది.. మీ అందరితో ఒకే విషయం చెబుతున్నా.. కేసీఆర్ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అని ఆమె వ్యాఖ్యానించింది.
Read Also: Puri Jagannadh: పూరి లవ్ స్టోరీ విన్నారా.. లావణ్యని అలా ఫిదా చేశాడట!
ఇక, ఇక్కడ రాహుల్ గాంధీ పేరుకు బదులు రాజీవ్ గాంధీ అంటూ షర్మిల నోరు జారడంతో.. నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 1991లోనే మరణించిన రాజీవ్ గాంధీని ఈరోజు ఢిల్లీలో కలిసొచ్చిన గొప్ప నాయకురాలు మన షర్మిలమ్మ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు ఇందిరా గాంధీని కలవలేదా? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశాడు.. కొందరైతే.. షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్ను కూడా ప్రస్తావిస్తూ విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు.
సోనియా గాంధీ నీ
రాజీవ్ గాంధీ నీ కలిసింది అంటా
🙄🙄🙄అన్నయ్య నే అనుకున్నాం చెల్లి కుడా ఆత్మలతో మాట్లాడుతుంది అన్నమాట #Sharmila #HelloAP_ByeByeYCP pic.twitter.com/RC1eafwMDE
— SANDEEP JSP (@JspSandeep_) August 31, 2023
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..