YS Jagan: ఏపీలో తాజా పరిణామాలపై జగన్ సంచలన ట్వీట్..
- ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై జగన్ సంచలన ట్వీట్..
- పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారు..
- సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని అవకాశం ఉండాలి..
- ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది..
- బాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది..
- పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు..
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు.. పోలీసు రాజ్యంమా? నియంతృత్వ రాజ్యమా? అన్నట్టుగా మారింది అంటూ ఆరోపణలు గుప్పించారు.
Read Also: Radhika Yadav Murder: టెన్నిస్ ప్లేయర్ హత్య కేసు.. వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు!
Also Read
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
చట్టానికి లోబడి నిరసనలు తెలిపినా అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.. ఇది ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు వైఎస్ జగన్.. ప్రతిపక్షం, ప్రజలు, నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులుమేస్తున్నారన్న ఆయన.. గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు ఒక కేసు నమోదు చేశారు. రామగిరిలో టీడీపీ గూండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే మూడు కేసులు పెట్టి 15 మందిని అరెస్టు చేశారు. పల్నాడులో పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్తే ఐదు కేసులు నమోదు చేశారు. 131 మందికి నోటీసులు జారీ చేశారు.. సినిమా పోస్టర్ ప్రదర్శించిన యువకుడిని జైల్లో పెట్టారు అంటూ ధ్వజమెత్తారు..
Read Also: CM Chandrababu: మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చిన సీఎం.. ఆనందానికి అవదులు లేవు అంతే..!
ఇక, బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించటానికి వెళ్తే ఇప్పటికే ఐదు కేసులు పెట్టి, 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.. రెండు రోజులుగా వారిని అరెస్టు చేసినట్లు చూపించటంలేదు, కోర్టు ముందు హాజరుపరచలేదు.. ప్రతి కేసులోనూ మరికొందరు అని రాస్తూ వారిష్టం వచ్చినట్టుగా వైసీపీ కేడర్ ని అక్రమంగా ఇరికిస్తున్నారని విమర్శించారు జగన్.. నా ప్రతి పర్యటనలోనూ ఇలాంటి అక్రమ కేసులు పెట్టటమే కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు.. లాఠీ ఛార్జీలు చేస్తూ ఆంక్షలు పెడుతూ అణచివేత కార్యక్రమాలు చేస్తున్నారు.. ప్రతిపక్షాన్ని బెదిరించి, అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది.. ఇందుకోసం పోలీసు వ్యవస్థను వాడుకోవటం సరికాదంటూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
CM @ncbn suppressing dissent with state machinery
The right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025
తాజావార్తలు
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!