YS Jagan: రెంటపాళ్ల పర్యటన విజయవంతమైంది.. జనం ఎలా వచ్చారో మీరే చూశారు!
- రెంటపాళ్ల పర్యటన విజయవంతమైంది
- సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది
- రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి
- మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెంటపాళ్ల పర్యటనకు జనం ఎలా వచ్చారో చూశారు కదా?.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని, తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం మీడియా సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నాణేనికి రెండవ వైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రజలకు రెండవ వైపు స్టోరీ తెలియాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిగజారిపోయింది. మోసాలు, అబద్ధాల మధ్య చంద్రబాబు పాలన సాగుతోంది. వెన్నుపోటు దినం పేరిట వైసీపీ ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల నుంచి ప్రజల స్పందన బాగుంది. ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది లోపే ఇంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నది.. దేశ చరిత్రలో కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఒక నియంత మాదిరిగా అణిచి వేయాలని చూస్తున్నారు. నిన్న సత్తెనపల్లిలో నా ప్రోగ్రాం ఒక కర్ఫ్యూ లాగా చేద్దామన్నారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి?. ప్రోగ్రాంకు రాకూడదు అని ఆంక్షలు పెట్టారు. కార్యక్రమానికి వచ్చే జనాన్ని కట్టడి చేశారు. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అని నేను చెప్పాల్సింది ఏమీ లేదు.. అందరూ చూశారు. ఒక ప్రతిపక్ష నేత ప్రజల దగ్గరకు వెళ్తే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు?’ అని జగన్ ప్రశ్నించారు.
Also Read
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
‘పొదిలి పొగాకు రైతుల కోసం వెళ్తే ప్రజలు వేలాదిగా స్పందించారు. గిట్టుబాటు ధరలు లేక ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నలభై వేల మంది వచ్చిన కార్యక్రమానికి కేవలం 40 మందితో నిరసన పెట్టారు. 40 మందితో డిస్ట్రబ్ చేయాలని చూశారు. సమన్వయం పాటించారు కాబట్టే.. 40 వేల మంది 40 మంది మీద తిరగబడలేదు. అయినా ఉల్టాగా రైతులపై కేసుల పెట్టారు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావటం లేదు. ఏ పంటకు మద్దతు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అయినా ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
ట్రెండింగ్
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!