Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ys Jagan Fires On Chandrababu Government

YS Jagan: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

Published Date :October 17, 2024 , 4:25 pm
By Mahesh Jakki
  • అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు..అనుబంధ సంఘాల నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం
  • జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సన్నద్ధం
  • జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటామని పేర్కొన్నారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయి నుంచిజిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను నిర్వర్తించాలన్నారు. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం ఏర్పాటయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలని సూచించారు.

అనుబంధాల విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. కమిటీలు ఏర్పాటన్నది కాగితాలకే పరిమితం కాకూడదన్నారు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదని.. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. ఇలాచేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్‌ ఒన్‌ పార్టీగా మనం ఎదుగుతామన్నారు. గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయత్వం లేక కాదన్నారు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలని.. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించారు. అప్పుడు మనం ఇచ్చిన పిలుపుకు ఉద్ధృతమైన స్పందన వస్తుందన్నారు.

వైఎస్ జగన్ మాట్లాడుతూ.. “మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి, బాధితులకు అండగా నిలవాలి. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే చెప్తారు. ఇప్పటికీ మనం ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలం.ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. బడ్జెట్‌తోపాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సంక్షేమ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసేవాళ్లం. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా మనం వెనకాడం కాని, అబద్ధాలు చెప్పలేం. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు: విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి. అధికారం ఉండొచ్చు.. పోవచ్చు. కాని, మళ్లీ మనం అధికారంలోకి తీసుకు వచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ప్రజలు మనం చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పివన్నీ జగన్‌ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది.” అని జగన్‌ పేర్కొన్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు.. పీఎస్‌ వద్ద భారీ భద్రత

ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతామని.. టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా అంటూ జగన్ ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవన్నారు. ప్రతి కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు మనం చేశామన్నారు. కాని, చంద్రబాబుగారు అబద్ధాలకు రెక్కలు కట్టారని విమర్శించారు. ప్రతి ఇంటికీ వైసీపీ నాయకులు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేశారని.. అమలు చేసిన హామీలే వైసీపీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. “ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు. ఆస్పత్రులునిర్వీర్యం అయిపోయాయి. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యాదీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిషు మీడియం లేదు, సీబీఎస్‌ఈ లేదు, టోఫెల్‌ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.ఉచిత ఇన్సూరెన్స్‌ గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పంటలకు ఎంఎస్‌పీలు రాని పరిస్థితి. ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీలచుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్‌ ఆర్డర్‌ సిట్యువేషన్‌ ఘోరంగా ఉంది. దిశయాప్‌కూడా ఏమయ్యిందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి:పోలీసులు దొంగకేసులకు పరిమితం అయ్యారు. డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు సెల్యూట్‌ కాకుండా, రాజకీయనాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.” అని జగన్ అన్నారు.

“ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ కూడా పోని పరిస్థితి. ఇసుక రేటు మన హయాంకన్నా డబుల్‌ రేటు, ట్రిపుల్‌ రేటు. మన హయాంలో ప్రజలకు రీజనబుల్‌ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో రేట్లు ఇచ్చేవాళ్లం. అక్రమాలకు పాల్పడితే… కేసులు పెట్టేవాళ్లం. అంత పగడ్బందీగా మనం అమలు చేశాం. ఇప్పుడు దీన్ని దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్‌యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఖాళీచేసేశారు. లిక్కర్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్‌ రూమ్స్‌ పెట్టి, టైమింగ్స్‌ తేసేసి, బెల్టుషాపులు లేకుండా చూసి, వాల్యూమ్స్‌ తగ్గించి… ప్రజలకు మంచిచేసేలా చూశాం.”అని జగన్ కూటమి సర్కారు గురించి విమర్శలు గుప్పించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • chandrababu government
  • cm chandrababu
  • Jamili election

తాజావార్తలు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions