Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న యూట్యూబర్.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు
- మ్యాచ్ పై పలువురి వీడియో బైట్లను తీసుకుంటుండగా ఘటన
- సెక్యూరిటీ గార్డు అభిప్రాయాన్ని అడిగేందుకు యత్నించిన యూట్యూబర్
- ఆగ్రహానికి గురై తుపాకితో కాల్చిన గార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా.. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్లో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్కు సంబంధించిన హృదయ విదారక వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు ఒక యూట్యూబర్ను కాల్చాడు.
READ MORE: Adani : అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒప్పందం..
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
పాకిస్థాన్లోని మీడియా కథనాల ప్రకారం.. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని పూనుకున్నాడు. కరాచీలోని మొబైల్ మార్కెట్కు వెళ్లి పలువురు దుకాణదారుల వీడియో బైట్లను తీసుకున్నాడు. ఆ సమయంలో అతను సెక్యూరిటీ గార్డు ముందు వచ్చి అతని అభిప్రాయాన్ని అడిగేందుకు యత్నించాడు. అయితే.. ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఇష్ట పడలేదు. బలవంతం పెట్టగా.. ఒక్కసారిగా యూట్యూబర్ సాద్పై కాల్పులు జరిపాడు. నిజానికి మైక్రోఫోన్ను అతని ముందు ఉంచడంతో గార్డుకు కోపం వచ్చింది. దీంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డు సాద్ను తన తుపాకీతో కాల్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదం తర్వాత కరాచీ మొబైల్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. యూట్యూబర్ సాద్ కుటుంబం అతడి సంపాదనపైనే ఆధారపడిందని స్నేహితుడు తెలిపాడు. సాద్ వివాహం అయ్యిందని.. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తైమూరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సెంట్రల్ తెలిపారు. గార్డును అరెస్టు చేశామన్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!