Crime: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాది దారుణ హత్య…
- ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణం
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని సొంత తమ్ముడిని స్క్రూడ్రైవర్తో బాదిన అన్న
- తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ.. తమ్ముడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా రాజ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధుర్కర్ గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అన్నయ్య తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటనలో అన్న రాజు పాల్ తన తమ్ముడు ఉమేష్ పాల్ తలపై స్క్రూడ్రైవర్తో దాడి చేశాడు. దీంతో రాజేష్ మృతి చెందాడు. మృతుడి కోడలు బిందు కథనం ప్రకారం.. అక్టోబర్ 15 సాయంత్రం ఇద్దరు అన్నదమ్ములు వెదురు అమ్ముకున్నారు. రాజేష్తో వెదురు అమ్మిన డబ్బు ఉంది. అన్నయ్య రాజు మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఉమేష్ నిద్రకు ఉపక్రమించాడు. ఇదే అవకాశంగా భావించిన రాజు తలపై స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ను కుటుంబ సభ్యులు వెంటనే రాజ్గఢ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)కి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కుటుంబంలో కలకలం రేపింది.
READ MORE: NIMS : నిమ్స్లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు…
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
అన్నదమ్ములిద్దరూ మద్యం మత్తులో
ఘటన జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) ఓపీ సింగ్ తెలిపారు. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న రాజు స్క్రూడ్రైవర్తో తలపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడని చెప్పారు. ఘటనానంతరం గాయపడిన ఉమేష్ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఈ కేసులో నిందితుడు రాజుపాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ ఓపీ సింగ్ తెలిపారు.
READ MORE: Bomb Threats: విమానాల బాంబు బెదిరింపుల మిస్టరీ వీడింది.. విచారణలో షాకింగ్ విషయాలు!
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!