AP News: మాయమాటలు చెప్పి.. పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం, చివరకు..!
- రాజమండ్రిలో దారుణం
- పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం
- నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలతో బయటకు తీసుకువెళ్లి పదో తరగతి హాస్టల్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు చెందిన అజయ్గా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
రాజమండ్రిలోని ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని సోమవారం సాయంత్రం అన్నయ్య వచ్చాడని, సబ్బులు తెచ్చుకోవాలని హాస్టల్ వార్డెన్కు చెప్పి బయటకు వెళ్ళింది. పరిచయం ఉన్న అజయ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి గోదావరి గట్టుకు బైక్పై తీసుకువెళ్లాడు. అజయ్ వెంట బైక్పై మరో యువకుడు వచ్చాడు. ఆ బాలిక పట్ల అసభ్య ప్రవర్తిస్తూ, మాయమాటలతో అజయ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఓ లాడ్జికు తీసుకువెళ్లాడు. రూమ్లో బాలికపై అజయ్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని బైక్పై తీసుకువచ్చి దేవీచౌక్లో దింపివేశాడు.
Also Read
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Also Read: CM Chandrababu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!
విద్యార్థిని హాస్టల్ లోనికి వెళ్లిపోయింది. అమ్మాయి కంగారు పడటం సహా మెడ, పెదాల పైన గాట్లు ఉండేసరికి అనుమానం వచ్చి వార్డెన్ ప్రశ్నించింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిన విషయం చెప్పడంతో కంగారుపడి వెంటనే వారి తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చింది. ముందుగా బాలికని ఆసుపత్రికి తీసుకువెళ్లి.. ఆ తర్వాత వార్డెన్తో సహా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి బంధువులు పిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి సెల్ నెంబర్ ఆధారంగా.. రావులపాలెంకు చెందిన అజయ్ గా పోలీసులు భావిస్తున్నారు. రాజమండ్రి పోలీసులు నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?