Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!
- రసాభాసగా కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం
- పోడియం వద్ద కార్పొరేటర్ మధ్య వాగ్వాదం
- కుర్చీ లేకపోవడంతో నిలబడే ఉన్న ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దాంతో వైసీపీకి చెందిన మేయర్ సురేశ్ బాబు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. ‘హూ ఈజ్ జైశ్రీ’ అంటూ మేయర్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు. రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని.. నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? అని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మండిపడ్డారు. దాంతో పోడియం వద్ద టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడుతూ… ‘మహిళను మేయర్ అవమానపరుస్తున్నారు. మేయర్ సురేశ్ బాబు తన కుర్చీని లాగేస్తారని భయపడుతున్నారు. అందుకే కాబోలు కుర్చీలాట ఆడుతున్నారు. అధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయనకు మహిళలు అంటే చిన్నచూపు. అందుకే మహిళలను నిలబెట్టారు. మేయర్ పక్కనే మహిళ ఎమ్మెల్యేకి కుర్చీ వేయాలి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంకు ఎలా కుర్చీలు వేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ వేయకపోవడంలో ఆంతర్యం ఏంటి. హూ ఈజ్ జైశ్రీ, రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు?’ అని ప్రశ్నించారు. దాంతో మేయర్, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు సాగాయి.
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
- వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
- Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
Also Read: MLA Parthasarathi: నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే.. ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు!
కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నిలబడే ఉన్నారు. మేయర్ కుర్చీకి ఒక వైపు టీడీపీ, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు నిల్చొని నిరసన తెలిపారు. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మేయర్కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కింద బైఠాయించి నిరసన తెలపగా.. ఎమ్మెల్యేకు కుర్చీ ఇవ్వాలంటూ టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. పోటాపోటీ నినాదాలతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
-
UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
-
Shakeela: ‘ది డర్టీ పిక్చర్లో చూపించినది అబద్ధం’.. సిల్క్ స్మితపై షకీలా సంచలన కామెంట్స్!
-
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!