Adapa Seshu : కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండేవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ సహా పలువురు ప్రజా ప్రతినిధుల హాజరయ్యారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. విజయవాడ నగరం వంగవీటి మోహన రంగా అడ్డా అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి మోహన్ రంగా ఒక ఐకాన్ అని, రంగా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండేవారని, కాపులంతా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాకుండా.. ‘మనకు మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రంగాను టీడీపీ పార్టీ మట్టు బెట్టించింది. చంద్రబాబు కుట్రతోనే రంగా హత్య జరిగింది. ఈ రాష్ట్రంలో కాపులపై కుట్ర జరుగుతోంది. రంగా ధ్యేయం టీడీపీ పార్టీ పతనం. వంగవీటి మోహనరంగా అభిమానులుగా మన లక్ష్యం కూడా అదే. కాపు సామాజికవర్గానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. రంగా ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.’ అని ఆయన అన్నారు.
Also Read : Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్లోకి కంటైనర్.. 12 మంది మృతి
Also Read
అనంతరం గుంటూరు మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాను మట్టు బెట్టింది టీడీపీ, చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రంగా.. ఇవాళ సాయంత్రంలోగా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ రంగా విగ్రహానికి నివాళులర్పించగలరా..? అని అన్నారు. కాపులకు మేలు చేసింది ఆనాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చనిపోయి 30 ఏళ్లు దాటినా రంగా ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారని, రంగాను ఎవరు చంపారో.. చంపించారో.. అందరికీ తెలుసునన్నారు. ప్రజలున్ని విషయాలు మర్చిపోతారనే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కాపులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?