Adapa Seshu : కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండేవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ సహా పలువురు ప్రజా ప్రతినిధుల హాజరయ్యారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. విజయవాడ నగరం వంగవీటి మోహన రంగా అడ్డా అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి మోహన్ రంగా ఒక ఐకాన్ అని, రంగా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. కష్టం ఎక్కడుంటే అక్కడ రంగా ఉండేవారని, కాపులంతా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాకుండా.. ‘మనకు మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రంగాను టీడీపీ పార్టీ మట్టు బెట్టించింది. చంద్రబాబు కుట్రతోనే రంగా హత్య జరిగింది. ఈ రాష్ట్రంలో కాపులపై కుట్ర జరుగుతోంది. రంగా ధ్యేయం టీడీపీ పార్టీ పతనం. వంగవీటి మోహనరంగా అభిమానులుగా మన లక్ష్యం కూడా అదే. కాపు సామాజికవర్గానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. రంగా ఆశయాలను కొనసాగిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.’ అని ఆయన అన్నారు.
Also Read : Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్లోకి కంటైనర్.. 12 మంది మృతి
Also Read
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
అనంతరం గుంటూరు మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాను మట్టు బెట్టింది టీడీపీ, చంద్రబాబు అని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రంగా.. ఇవాళ సాయంత్రంలోగా చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ రంగా విగ్రహానికి నివాళులర్పించగలరా..? అని అన్నారు. కాపులకు మేలు చేసింది ఆనాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చనిపోయి 30 ఏళ్లు దాటినా రంగా ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారని, రంగాను ఎవరు చంపారో.. చంపించారో.. అందరికీ తెలుసునన్నారు. ప్రజలున్ని విషయాలు మర్చిపోతారనే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. కాపులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
తాజావార్తలు
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!