Botsa Satyanarayana: 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది: మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం అని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం. 2019లో ఉత్తరాంధ్ర నుండే అత్యధిక స్థానాలు వచ్చాయి. అందుకే ఇక్కడి నుండే సభ పెట్టాం. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది నారా చంద్రబాబే. కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నాం. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే ప్రదాని మోడీని కలిశారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలుకో ఆర్డినేషన్తో వెళ్లాలి’ అని అన్నారు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
Also Read: YS Sharmila: సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు: వైఎస్ షర్మిల
‘మేము మూడు రాజదానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కోడుతోంది. ప్రతిపక్షాల వారికి అధికారం కావాలి.. మాకు మాత్రం సంక్షేమం కావాలి. ప్రజలు ఏదీ మరిచిపోరు.. మరో డెబ్బై రోజుల్లో సమాదానం చెబుతారు. చంద్రబాబు, జగన్.. ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో ఓసారి బేరీజువేసుకోండి. గంటా స్వయంగా రాజీనామా ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రాసి స్పీకర్ గారిని కలిసే రాజీనామా విషయం చెప్పారు. ఆయన స్వలాభం కోసం రాజీనామా చేసారా?. దానిని మాపై ఆపాదిస్తే ఎలా?. నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!