Botsa Satyanarayana: 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది: మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం అని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం. 2019లో ఉత్తరాంధ్ర నుండే అత్యధిక స్థానాలు వచ్చాయి. అందుకే ఇక్కడి నుండే సభ పెట్టాం. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది నారా చంద్రబాబే. కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నాం. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే ప్రదాని మోడీని కలిశారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలుకో ఆర్డినేషన్తో వెళ్లాలి’ అని అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: YS Sharmila: సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు: వైఎస్ షర్మిల
‘మేము మూడు రాజదానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కోడుతోంది. ప్రతిపక్షాల వారికి అధికారం కావాలి.. మాకు మాత్రం సంక్షేమం కావాలి. ప్రజలు ఏదీ మరిచిపోరు.. మరో డెబ్బై రోజుల్లో సమాదానం చెబుతారు. చంద్రబాబు, జగన్.. ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో ఓసారి బేరీజువేసుకోండి. గంటా స్వయంగా రాజీనామా ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రాసి స్పీకర్ గారిని కలిసే రాజీనామా విషయం చెప్పారు. ఆయన స్వలాభం కోసం రాజీనామా చేసారా?. దానిని మాపై ఆపాదిస్తే ఎలా?. నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!