Botsa Satyanarayana: 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది: మంత్రి బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం అని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నాం. 2019లో ఉత్తరాంధ్ర నుండే అత్యధిక స్థానాలు వచ్చాయి. అందుకే ఇక్కడి నుండే సభ పెట్టాం. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది నారా చంద్రబాబే. కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నాం. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డే ప్రదాని మోడీని కలిశారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలుకో ఆర్డినేషన్తో వెళ్లాలి’ అని అన్నారు.
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
Also Read: YS Sharmila: సీఎం అయిన తర్వాత జగన్ మారిపోయాడు: వైఎస్ షర్మిల
‘మేము మూడు రాజదానులకి మద్దతు ఇస్తే.. బీజేపీ అమరావతికి జై కోడుతోంది. ప్రతిపక్షాల వారికి అధికారం కావాలి.. మాకు మాత్రం సంక్షేమం కావాలి. ప్రజలు ఏదీ మరిచిపోరు.. మరో డెబ్బై రోజుల్లో సమాదానం చెబుతారు. చంద్రబాబు, జగన్.. ఎవరి పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయో ఓసారి బేరీజువేసుకోండి. గంటా స్వయంగా రాజీనామా ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లెటర్ రాసి స్పీకర్ గారిని కలిసే రాజీనామా విషయం చెప్పారు. ఆయన స్వలాభం కోసం రాజీనామా చేసారా?. దానిని మాపై ఆపాదిస్తే ఎలా?. నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుంది’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!