Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ycp Leader Amzath Basha Slams Ap Govt

Amzath Basha: నిధులు లేవంటూ.. నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు!

Published Date :December 1, 2024 , 2:34 pm
By Sampath Kumar
  • ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది
  • నిధులు లేవంటూ నిందలు వేస్తున్నారు
  • వైసీపీ తరపున పోరాడుతాం
Amzath Basha: నిధులు లేవంటూ.. నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆంజాద్ బాషా ఫైర్ అయ్యారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.

మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా మాట్లాడుతూ… ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ అనేక హామీలు ఇచ్చారు.. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిధులు లేవంటూ వైఎస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేసారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు 4 పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది. మారి కమిటీనెలా రద్దు చేస్తారు?. కమిటీకి 5 ఏళ్ల కాలం, పదవీ కాలం ఉంటే ఎలా రద్దు చేస్తారు?. కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా?’ అని ప్రశ్నించారు.

Also Read

  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
  • CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
Add as a preferred
source on google

‘నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి?. 2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాక చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది. దాన్ని ముస్లింలు అంతా వ్యతిరేకిస్తున్నారు. జగన్ గారి ఆదేశాలతో పార్లమెంటులో వైసీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి. అందుకే వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. ఈ 6 నెలల్లో మైనారిటీలకు ఏమీ చేయకుండా.. మీ వారిని సభ్యులుగా పెట్టుకోవాలని ఇలా ఉపసంహరణ చేస్తున్నారు. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైసీపీ తరపున పోరాడుతాం’ అని ఆంజాద్ బాషా పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amzath Basha
  • ap
  • tdp
  • ycp
  • ys jagan

తాజావార్తలు

  • Thalapathy Vijay: విజయ్ ‘పట్టాభిషేకానికి’ ఊపిరి పోస్తున్న 32 ఏళ్ల నాటి ‘బొమ్మై’ తీర్పు! తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్..

  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..

  • Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions