Yashaswi Jaiswal: పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన జైస్వాల్.. ఏకంగా ఎనిమిది రికార్డులు..
- పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్
- ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ
- ఈ సెంచరీతో ఎనిమిది రికార్డులు సొంతం చేసుకున్న స్టార్ ఓపెనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.
పెర్త్ టెస్ట్ మూడో రోజు (నవంబర్ 24), యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. 205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల బాదిన యువ ఆటగాడు.. ఈ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో కంపోజ్ చేసిన సెంచరీతో తన సత్తాను నిరూపించుకున్నాడు. జోష్ హేజిల్వుడ్ వేసిన బంతికి పైర్ కట్ కొట్టడం ద్వారా అతను అద్భుతమైన శైలిలో ఈ ఫీట్ సాధించాడు. 22 ఏళ్ల జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. అయితే వీరిద్దరూ ప్రత్యేక భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. యశస్వి ఈ సెంచరీతో 8 రికార్డులు క్రియేట్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం…
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
యశస్వి సాధించిన రికార్డులు..
- మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్గా రికార్డు
- ఇన్నింగ్స్పరంగా అత్యంత వేగంగా 1500+ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్గా యశస్వి. 28 ఇన్నింగ్స్ల్లో దీన్ని సాధించాడు. గతంలో పుజారా కూడా 28 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.
- ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్గా యశస్వి రికార్డు.
- ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్గా యశస్వి రికార్డు సృష్టించాడు. అతడు 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు)
- యశస్వి కంటే ముందు జైసింహా (1967-68), సునీల్ గావస్కర్ (1977-78) సాధించారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్లోనే చేయడం గమనార్హం.
- 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి ఐదో బ్యాటర్. ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించాడు.
- భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి (4). సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు.
- ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన బ్యాటర్ కేఎల్ రాహుల్. 2014-15 సీజన్లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు యశస్వి సెంచరీ నమోదు చేశాడు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!